14 నుంచి వెబ్‌సైట్‌లో జేఈఈ హాల్‌టికెట్లు | Sakshi
Sakshi News home page

14 నుంచి వెబ్‌సైట్‌లో జేఈఈ హాల్‌టికెట్లు

Published Thu, Mar 9 2017 8:44 PM

14 నుంచి వెబ్‌సైట్‌లో జేఈఈ హాల్‌టికెట్లు

హైదరాబాద్‌:
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో, కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇతర ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షల హాల్‌ టికెట్లు ఈనెల 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెల 2న ఆఫ్‌లైన్‌లో, 8, 9 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించే జేఈఈ మెయిన్‌కు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు 14వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) వెల్లడించింది.

ఈ మేరకు వెబ్‌సైట్‌లో ఈ అంశాన్ని చేర్చింది. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ నుంచి 70 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement
Advertisement