Sakshi News home page

కండక్టర్ను దుస్తులు విప్పి.. కొట్టిన ప్రయాణికుడు

Published Thu, Jun 5 2014 11:30 AM

కండక్టర్ను దుస్తులు విప్పి.. కొట్టిన ప్రయాణికుడు

దేశ ఆర్థిక రాజధాని ముంబై శివార్లలో ఘోరం జరిగింది. తండ్రి వయసున్న డ్రైవర్ను ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించినందుకు బస్సులో ఉన్న మహిళా కండక్టర్ను ఓ ప్రయాణికుడు కిందకు లాగి, దుస్తులు ఊడదీసి, కొట్టాడు. థానె జిల్లా పరిధిలోని కళ్యాణ్ - పన్వేల్ మధ్య తిరిగే బస్సు మొదటి ట్రిప్పులోనే ఈ ఘోరం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా ప్రయాణికుల్లో ఒక్కరూ స్పందించలేదు. కేవలం నిలబడి చోద్యం చూస్తూ ఉండిపోయారు. కాసేపటి తర్వాత బస్సులో ఉన్న కొంతమంది విద్యార్థులు కలగజేసుకుని నిందితుడు అభిషేక్ సింగ్ (30)ను ఆపారు. తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

ఈ సంఘటనపై బాధిత కండక్టర్ (34) ఇలా వివరించారు.. ''అతడిని బస్సు దిగాల్సిందిగా నేను చెప్పాను. అంతే, నా కాళ్లు పట్టకుని లాగేసి, బస్సులోంచి కింద రోడ్డుమీద పడేశాడు. తర్వాత నా దుస్తులు చించేసి నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. మా వెనకాల మరో బస్సు ఉంది. అందులో ఉన్న మరో మహిళా కండక్టర్ నన్ను కాపాడేందుకు ప్రయత్నించగా, ఆమెనూ కొట్టాడు. బస్టాపులో బస్సు ఆగినప్పుడు ఈ సంఘటన జరిగినా, జనమంతా బస్సులో ఉన్నా ఏ ఒక్కళ్లూ నన్ను కాపాడేందుకు రాలేదు'' అని చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement