సాక్షి ముంబై: మెట్రో రైలుతో నాగపూర్ మెట్రో నగరంగా మారనుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నాగపూర్ మెట్రోరైలు ప్రాజెక్టు, మౌద్ ఎన్టీపీసీ ప్రాజెక్టుతోపాటు ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలే కీలకమని తెలిపారు. అన్నింటికంటే విద్యుత్ ఉత్పత్తి ముఖ్యమన్నారు. నాగపూర్ నగరంలో మెట్రో రైలు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ఇక్కడి జనజీవనం మరింత వేగవంతం కానుందని మోడీ అన్నారు. మౌలిక సదుపాయాలు విద్యుత్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు.
పుణేలోనూ మెట్రో ఏర్పాటు చేస్తాం: మంత్రి వెంకయ్య నాయుడు.
నాగపూర్తోపాటు పుణేలోనూ మెట్రో రైలును ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయిడు వెల్లడించారు. నాగపూర్ మెట్రో ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలోపాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ పైవిషయాలు తెలిపారు. అనేక రోజులుగా పెండింగ్లో ఉన్న పుణే మెట్రో ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రకటించారు. ముంబైలోనూ ముంబై మెట్రో-3 ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని చెప్పారు. నాగపూర్ మెట్రో రైలు కోసం రూ. 8,680 కోట్ల వ్యయం కానుందని మంత్రి అన్నారు.
అభివృద్ధి కోసం అందరు ఒక్కటవ్వాలి...
రాష్ట్రం, దేశం అభివృద్ధి కోసం అంతా ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నాగపూర్ మెట్రో, ఎన్టీపీసీ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి, ఉప-ముఖ్యమంత్రులు రాకపోవడంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మనమంతా వేరే రాష్ట్రాల ప్రజలమైనా, దేశం ఒక్కటేనని అన్నారు. అభివృద్ధి కోసం అందరం ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు.
భూమిపుత్రులకు ఉద్యోగాలివ్వాలి : నితిన్ గడ్కరి.
అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్థలాలు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కోరారు. మౌద్లో ఎన్టీపీసీ ప్రాజెక్టు ప్రారంభోత్సవం గడ్కరీ మాట్లాడుతూ అనేక స్థానిక సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు. విదర్భలోని వెయ్యి పాఠశాలల్లో ఎన్టీపీసీ మరుగుదొడ్లు నిర్మించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు.
నల్లజెండాలు ప్రదర్శించిన విదర్భవాదులు...
నాగపూర్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రత్యేక విదర్భ వాదులు నల్లజెండాలు చూపించి తమ వ్యతిరేకత తెలిపారు. ప్రత్యేక విదర్భ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ పర్యటనను నిరసిస్తూ నల్లజెండాలు ప్రదర్శించారు. రంగంలోకి పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వల్పస్థాయిలో లాఠీచార్జి జరిగింది.
మెట్రోతో మహానగరం
Published Thu, Aug 21 2014 10:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement