రాహుల్‌ మహిళలను అవమానించారు : మోదీ | Sakshi
Sakshi News home page

రాహుల్‌ మహిళలను అవమానించారు : మోదీ

Published Wed, Jan 9 2019 8:02 PM

Modi Accused Rahul Gandhi Insulted Women With Remark On Defence Minister - Sakshi

లక్నో : రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై వ్యాఖ్యల ద్వారా కాం‍గ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మహిళలను అవమానించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆగ్రాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ రాహుల్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు.

రఫేల్‌ ఒప్పందంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంటే ప్రధాని మోదీ పారిపోయి మహిళ (రక్షణ మంత్రి) వెనుక దాక్కున్నారని రాహుల్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. పాలక బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎన్నడూ ఒకరి ముఖం ఒకరు చూడని రాజకీయ ప్రత్యర్ధులు సైతం ఏకమవుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని ఆగ్రా పర్యటనలో భాగంగా రూ 2980 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement