ఇతరుల కోసం త్యాగాలు చేసిన చరిత్ర భారత్ది
- ప్రవాసీ భారతీయ కేంద్రం ప్రారంభోత్సవంలో మోదీ
న్యూఢిల్లీ: ఇతరుల తరఫున పోరాడిన త్యాగ చరిత్ర భారత్దని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదని, ఇతరుల భూభాగాల్ని ఆక్రమించుకోవాలన్న దురాశ ఎప్పుడూ లేదని ఆదివారం ఢిల్లీలో ప్రవాసీ భారతీయ కేంద్రం ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల కోసం ఈ అత్యాధునిక కాంప్లెక్స్ను నిర్మించారు. ‘భారత్ ఎవరిపైనా దాడి చేయలేదు. ఇతరుల భూభాగాల కోసం దుశాశ లేదు. రెండు ప్రపంచ యుద్ధాల్లో (భారత్ ప్రత్యక్షంగా పాల్గొనక పోయినా)1.5 లక్షల మంది భారతీయ సైనికులు ఇతరుల కోసం ప్రాణత్యాగం చేశారు’ అని పేర్కొన్నారు. భారతీయులు గొప్ప త్యాగాలు చేసినా, వాటి గొప్పదనాన్ని ప్రపంచం గుర్తించేలా చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎప్పుడు విదేశాలకు వెళ్లినా... భారత సైనికుల స్మృతిచిహ్నాల్ని సందర్శించమంటూ చెపుతానన్నారు. ‘విదేశాల్లోని భారతీయులకు అక్కడి రాజకీయాల్లో ఆసక్తి లేదు. ఇతర వర్గాలతో వారు సులువుగా కలసిపోతారు. సాంఘిక ఉన్నత జీవనమే ప్రవాస భారతీయుల సిద్ధాంతం. ప్రవాస భారతీయులు నీళ్ల వంటి వారు... అవసరాన్ని బట్టి రంగు, ఆకారాన్ని మార్చుకోగలరు’ అని అన్నారు. ‘కొన్ని దేశాల్లో భారతీయ సమాజం...అక్కడి ఎంబసీలకంటే బలోపేతంగా ఉన్నాయి. భార త్ పట్ల తెలియని భయాల్ని తొలగించడంలో వారు సాయం చేయగలరు.విదేశాల్లోని భారతీయుల బలాన్ని ఒక్క తాటిపైకి తీసుకొస్తే మేధోవలసను పెంచవచ్చు. ఆనకట్టతో జల శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చినట్లు... 2.45 కోట్ల మంది ప్రవాసభారతీయుల శక్తిని వాడితే భారత్ను వెలిగించవచ్చు’అని ఆశాభావం వ్యక్తం చేశారు. నేపాల్ భూకంప బాధితు లకు సాయం చేయడంలో, యెమెన్లో చిక్కుకున్న భారతీయుల్ని ,ఇతర దేశస్తుల్ని తరలించడంలో విదేశాంగ శాఖ చేసిన కృషిని మోదీ కీర్తించారు. ‘ఇతర దేశాలు ఇబ్బందుల్నుంచితమ ప్రజల్ని కాపాడాలని భారత్ను కోరుతున్నారు’ అనిపేర్కొన్నారు.
రైల్వేల అభివృద్ధిపై మేధోమథనం
రైల్వేలు లక్ష్యాల్ని అందుకునేలా రోడ్మ్యాప్ రూపొందించేందుకు మోదీ రైల్వే ఉద్యోగులతో ముచ్చటించనున్నారు. 400 మందితో ప్రత్యక్షంగా, 20 వేల మందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నవంబర్ 25 నుంచి 27 వరకూ మేధోమథనసదస్సులో మోదీ పాల్గొంటారు.
పరాయి నేలను ఆశించం
Published Mon, Oct 3 2016 1:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement