ముంబై సెంట్రల్, న్యూస్లైన్ : మహారాష్ట్ర రాజధాని ముంబై రోడ్డు ప్రమాదాల సంఖ్యలో అగ్ర స్థానంలో ఉంది. 2013 సంవత్సరంలో నగరంలో అత్యధికంగా 8,238 మంది వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందారు. ముంబై జనాభాను బట్టి లక్ష మందిలో 45 మంది వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని వెల్లడైంది. దేశంలోని ఇతర మహానగరాలతో పోలిస్తే ఈ సంఖ్య అత్యధికంగా ఉంది. 2012 సంవత్సరంతో పోలీస్తే గత సంవత్సరం మృతుల సంఖ్య 575కు పెరిగినట్లు ‘ఎన్సీఆర్బీ’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
లక్షమందిలో 45 మంది మృతి
2011లో జరిగిన జనగణన ప్రకారంగా ముంబైలో కోటి 84 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ సంఖ్య దేశ జనాభాతో పోలిస్తే 11.4 శాతం. ప్రతి లక్ష జనాభాలో 45 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నా రు. చెన్నైలో లక్ష మందిలో 44 మంది చనిపోతున్న ట్లు తెలిసింది. చెన్నై తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 41 మంది ప్రమాదాలకు బలవుతున్నా రు. అతితక్కువగా కోలకత్తాలో మృత్యువాతపడుతున్నారు. ఈ నగరంలో లక్ష మందిలో కేవలం ఆరుగురు మరణిస్తున్నారు.
అన్ని పట్టణాలతో పోలిస్తే కేవలం ముంబైలో మాత్రమే మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2013లో ముం బైలో చనిపోయిన వారిలో 13.4 శాతం రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. దేశంలోని 53 మహా నగరాల్లో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న సంఖ్య లో ముంబై అగ్ర స్థానం లో ఉంది. రాష్ట్రంలో 2013 లో మొత్తం 62,770 మంది ప్రమాదాల్లో చనిపోయారు. ప్రధాన నగరాలు పుణేలో 4,141, అహమ్మద్నగర్లో 1,665, ఔరంగాబాద్లో 761, నాసిక్లో 1,070 మంది మృత్యువాతపడ్డారు.
ముంబైలో 2013లో ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 7.5 శాతానికి పెరిగింది. 2012లో 7,663 మంది చనిపోయారు. వారిలో ఎక్కువ శాతం 45 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల వారున్నారని సర్వేలో తేలింది.
నెత్తురొడుతున్న రోడ్లు
Published Wed, Aug 6 2014 11:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement