టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి వెల్లడి
ప్రజాస్వామ్యయుతంగా అన్నీ సాధించుకుంటాం
కేంద్రంలో చేరుతామనడం ఊహాగానాలేనని వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను సాధించుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత జితేందర్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు అవసరమైన అన్ని అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
తెలంగాణకు కేంద్ర నిధులు తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మూడుసార్లు ప్రధాని మోదీని కలసి రాష్ట్ర అవసరాలను వివరించారని చెప్పారు. సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందులో తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి పార్టీ ఎంపీలతో సమీక్షిస్తామన్నారు. సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాక సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఢిల్లీలో ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ డిమాండ్లు నెరవేరకపోతే కేంద్రంపై ఒత్తిడి తెస్తారా అని విలేకరుల అడగగా... ప్రజాస్వామ్యబద్ధంగానే సాధించుకునేలా తగిన వ్యూహంతో ముందుకెళతామని సమాధానమిచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామ్యం కానున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అవన్నీ ఊహాజనితాలేనని జితేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై అసలు ఇప్పటి వరకు చర్చలే జరగలేదని పేర్కొన్నారు.
'హామీల అమలులో రాజీపడేది లేదు'
Published Mon, Feb 23 2015 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మహిళలే మహరాణులు
హైదరాబాద్ శివారులో బద్రీనాథుడు.. అచ్చం ఉత్తరాఖండ్ లాగే నిర్మాణం (ఫొటోలు)
పెనమలూరులో తుఫ్యాన్
అభివృద్ధి పరం
చరిత్రకు సాక్ష్యం
No Headline
నియోజకవర్గంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇలా
ఐదేళ్ల పాలనలో ఎంతో చేశాం
గోవాడ సుగర్స్ ఫ్యాక్టరీని ఆదుకున్న ప్రభుత్వం
బాలుడిపై దాడి కేసులో ఇద్దరి అరెస్టు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement