88 మంది భారతీయుల్ని అరెస్ట్ చేసిన పాక్ | Sakshi
Sakshi News home page

88 మంది భారతీయుల్ని అరెస్ట్ చేసిన పాక్

Published Sat, Feb 20 2016 7:06 PM

Pakistan arrests 88 Indian fishermen

ఇస్లామాబాద్: తమ ప్రాదేశిక సముద్ర జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్నారనే కారణంతో భారత్కు చెందిన 88 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మత్స్యకారులకు చెందిన 16 బోట్లను సైతం పాక్ సముద్రతీర ప్రాంత రక్షణ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని జియో టీవీ చానల్ వెల్లడించింది. మత్స్యకారులను కరాచీలోని తీర ప్రాంత పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసునమోదు చేసినట్లు సమాచారం.
 

Advertisement
Advertisement