జులై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు | Sakshi
Sakshi News home page

జులై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు

Published Wed, Jun 22 2016 7:53 PM

Parliament's Monsoon Session Likely To Begin On July 18

న్యూఢిల్లీ:  పార్లమెంటు వర్షకాల సమావేశాలు జులై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు రెండో వారం వరకు కొనసాగనున్నాయి. పార్లమెంటు వ్యవహారాల కమిటీ  హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ నెల 29 న సమావేశమై షెడ్యూల్ ను ప్రకటించనుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లు  రాజ్యసభలో పెండింగ్ ఉన్న విషయం తెలిసిందే.  ఈ సారి రాజ్యసభలో ప్రభుత్వ  సభ్యుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం బలంగా కనిపించనుంది. జీఎస్టీ ఆమోదానికి అన్ని రాష్ట్రాలు దాదాపుగా ఆమోదం తెలిపాయని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.
 
 
 
 

Advertisement
Advertisement