నేరస్తుల్ని చంపే హక్కు ప్రజలకుంది | Sakshi
Sakshi News home page

నేరస్తుల్ని చంపే హక్కు ప్రజలకుంది

Published Sat, May 28 2016 1:25 AM

People's right to kill criminals

హరియాణా డీజీపీ సంచలన వ్యాఖ్య

 ఛండీగఢ్: నేరస్తుల ప్రాణం తీసేందుకు ప్రజలకు హక్కు ఉందంటూ హరియాణా కొత్త డీజీపీ కేపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరం జరుగుతుండగా చూస్తున్నప్పుడు ఆ నేరస్తుడ్ని చంపే హక్కు చట్టం ఇచ్చిందన్న సంగతి ప్రజలకు తెలియదన్నారు. ‘ఎవరినైనా చంపేందుకు ప్రయత్నిస్తుంటే.. ఆ నేరానికి పాల్పడుతున్న వారిని చంపేందుకు చట్టం అనుమతిస్తోంది. ఇది సామాన్యుల బాధ్యత కూడా’ అన్నారు. ‘ఎవరైనా ఒక మహిళను అవమానిస్తే, మీరు చూస్తుండగా ఎవరినైనా చంపుతుంటే ఆ నేరస్తుడి ప్రాణం తీసేందుకు హక్కు ఉంది’అని ఆవేశంగా ప్రసంగించారు.

Advertisement
Advertisement