రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

Published Mon, Nov 2 2015 11:48 AM

Seven killed, 20 injured in accident Barasat

పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కంచరపర వద్ద యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు ఓ కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement