-
సందేశ్ఖాలీలో తుపాను!
బరాసత్/కోల్కతా: సందేశ్ఖాలీలో తుపాను మొదలైందని, అది పశ్చిమ బెంగాల్ను చుట్టుముట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అరాచకాలు, అకృత్యాలకు మారుపేరైన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళా శక్తి మట్టి కరిపించడం తథ్యమని అన్నారు. బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లా కేంద్రమైన బరాసత్ పట్టణంలో బుధవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీశక్తి వందన్ సభలో ఆయన ప్రసంగించారు. సందేశ్ఖాలీలో మహిళలపై నేరాలు సిగ్గుచేటన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, మహిళల భద్రతను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. బాధితుల్లో తిరుగుబాటు మొదలైందని, సందేశ్ఖాలీలో పుట్టిన తుఫాను రాష్ట్రాన్ని ముంచెత్తి తృణమూల్ను గద్దె దింపుతుందని అన్నారు. సందేశ్ఖాలీ అంశంలో హైకోర్టులో, సుప్రీంకోర్టులో మమత ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయని గుర్తుచేశారు. బాధితులకు న్యాయం చేకూరుస్తాం పశి్చమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో అత్యాచారాలకు, అకృత్యాలకు గురైన మహిళలకు న్యాయం చేకూరుస్తామని, తగిన భద్రత కలి్పస్తామని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు. అనంతరం సందేశ్ఖాలీ నుంచి వచి్చన మహిళలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐదుగురు బాధితులతో స్వయంగా మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై నిర్భయంగా పోరాడుతున్న సందేశ్ఖాలీ మహిళలను దుర్గా మాతతో పోల్చారు. బాధితుల గోడు విని ఆయన చలించిపోయారు. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా కలి్పంచారు. మరోవైపు సందేశ్ఖాలీ నుంచి నారీశక్తి వందన్ సభకు బస్సుల్లో వస్తున్న మహిళలను బెంగాల్ పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. బీజేపీ నాయకులు వారితో ఘర్షణకు దిగారు. కొంతమంది మహిళలు మాత్రమే సభకు రాగలిగారు. లాలూ కుటుంబం నేరగాళ్లమయం బేటియా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు బిహార్లో అతిపెద్ద నేరుగాళ్లని మోదీ ఆరోపించారు. పదేళ్ల ఆర్జేడీ పాలనలో బిహార్ను జంగిల్రాజ్ మార్చేశారని మండిపడ్డారు. బిహార్లో పశ్చిమ చంపారన్ జిల్లాలోని భేటియాలో రూ.12,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అప్పట్లో ఆర్జేడీ–కాంగ్రెస్ దుష్పరిపాలన వల్ల బిహార్ యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వారసత్వ రాజకీయాలు చేసేవారు తనపై మాటల దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇండియా కూటమి నేతలు రాముడిని కూడా కించపరుస్తున్నారన్నారు. దేశం పేదరికం నుంచి బయటపడాలంటే, మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో అతి పెద్దదిగా వ్యవస్థగా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు కట్టబెట్టాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కోల్కతాలో అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ప్రారంభం దేశంలోనే మొట్టమొదటి జలాంతర్భాగ మెట్రో రైలు సొరంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. కోల్కతా మెట్రోరైల్ నెట్వర్క్లో భాగంగా హుగ్లీ నది దిగువన ఈ సొరంగాన్ని నిర్మించారు. ఎస్ప్లానాడి నుంచి హౌరా మైదాన్ స్టేషన్ వరకు మెట్రో రైలులో మోదీ ప్రయాణించారు. రైలులో తనతోపాటు ప్రయాణించిన పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. అదే మార్గంలో ఎస్ప్లానాడి స్టేషన్కు తిరిగివచ్చారు. ఈస్ట్–వెస్ట్ కారిడార్లో అంతర్భాగమైన 4.8 కిలోమీటర్ల ఎస్ప్లానాడి–హౌరా మైదాన్ మెట్రో మార్గాన్ని రూ.4,960 కోట్లతో నిర్మించారు. ఈ మార్గంలో దేశంలోనే అత్యంత లోతైన రైల్వే స్టేషన్ ఉంది. ఉపరితలం నుంచి 32 మీటర్ల దిగువన హౌరా మెట్రో స్టేషన్ను నిర్మించారు. కోల్కతాలో బుధవారం మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మొత్తం రూ.15,400 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. -
లైంగికదాడికి యత్నించి.. రైల్లో నుంచి తోసి..
కోల్కతా: పశ్చిమబెంగాల్లో కొందరు దుండగులు రైలులో రెచ్చిపోయారు. ఓ 32 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా అడ్డుకున్న ప్రతిఘటించిన ఆమెను రైలులో నుంచి తోసేశారు. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. నుదుటిపైన, భూజాలకు బలంగా తగిలాయి. దీంతో ట్రాక్ పక్కనే స్పృహకోల్పోయి దాదాపు ఏడుగంటలపాటు అలాగే పడి ఉంది. అనంతరం కొందరు గ్రామస్తులు గమనించి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు బరాసత్లో జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఆమె ప్రస్తుత పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే ఆమె కాళ్లకు సర్జరీలు చేశారు. సీటీ స్కాన్ కూడా చేశారు. సెల్దా-హస్నాబాద్ మధ్యలో ఉన్న హరోవా స్టేషన్కు సమీపంలోని లేడిస్ కంపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. -
బీజేపీ జాతీయ కార్యదర్శికి గాయాలు
కోల్ కతా: పోలీసులతో జరిగిన ఘర్షణలో బీజేపీ నాయకులు గాయపడిన ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. 'చట్ట అతిక్రమణ' కార్యక్రమంలో భాగంగా నార్త్ 24 పరగణ జిల్లాలోని బరసాత్ లో ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ నాథ్ సింగ్ సహా 15 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తోపులాటలో 10 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. పోలీసులు తమపై లాఠిచార్జి చేశారని సిద్ధార్థ నాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని విమర్శించారు. రాజకీయ నేతలను, కార్యకర్తలను నేరస్తులుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. తీవ్రవాదులు, నేరస్తులను తృణమూల్ కాంగ్రెస్ అల్లుళ్ల మాదిరిగా చూస్తోందని మండిపడ్డారు. లాఠిచార్జి చేయలేదని, తోపులాటలో బీజేపీ నాయకులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దుష్పరిపాలన సాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ 'చట్ట అతిక్రమణ' ఆందోళనకు దిగింది. -
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కంచరపర వద్ద యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు ఓ కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రత్యేక ఏర్పాట్ల కోసం టాన్స్ జెండర్ అభ్యర్థి ధర్నా
ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
'భజే వాయు వేగం' ట్రైలర్ విడుదల
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
జంతు సంరక్షణ జిల్లా నోడల్ అధికారిగా ఏఎస్పీ
ఈవీఎం, స్ట్రాంగ్ రూముల పరిశీలన
ఈదురు గాలులతో వర్షం
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
లాభాలు మెండు..
రగ్బీ జిల్లా జట్టు ఎంపిక
తప్పక చదవండి
- మెట్రోలో కొట్టుకున్న మహిళలు
- సెల్యూట్ కొట్టలేదని.. నెలరోజుల జీతం కోత
- SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ
- మంత్రి ఉత్తమ్ కుమార్పై నమ్మకముంది: బండి సంజయ్
- ఈవీఎంలకు ట్యాగ్లు?.. బీజేపీపై ట్యాంపరింగ్ ఆరోపణలు
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్ఫుల్
- ఛత్తీస్గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
- అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
- AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
- Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Advertisement