తెలంగాణ ఎయిమ్స్‌ పనులు ప్రారంభించండి  | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎయిమ్స్‌ పనులు ప్రారంభించండి 

Published Wed, Jan 31 2018 3:29 AM

telangana aiims work starts mp boora request to health minister

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతిపాదిత ఎయిమ్స్‌కు వెంటనే నిధులు విడుదలచేసి, పనులు ప్రారంభించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఆ శాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ను వేర్వేరుగా కలసి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో హామీ ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement