- మధ్యప్రదేశ్లో ముస్లిం మహిళలపై దుశ్చర్య
- రాజ్యసభలో బీజేపీపై విరుచుకుపడిన కాంగ్రెస్, బీఎస్పీ
మంద్సౌర్(ఎంపీ) : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోసంరక్షణ పేరిట దాడులు కొనసాగుతున్నాయి. గుజరాత్ ఘటన మరిచిపోకముందే మధ్యప్రదేశ్లోనూ దాడి జరిగింది. మంద్సౌర్లో గోమాంసాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణపై ఇద్దరు ముస్లిం మహిళలను స్థానికులు తీవ్రంగా కొట్టారు. మంద్సౌర్ ఎస్పీ మనోజ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆవు మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు ముస్లిం మహిళలను మన్సౌ రైల్వేస్టేషన్లో కొడుతున్నారని మంగళవారం తమకు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఓ మహిళతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారు జావ్రా నుంచిమాంసాన్ని తరలిస్తున్నారని.. అది గేదె మాంసమని తేలిందన్నారు. వారిద్దరినీ అరెస్టు చేసి, కోర్టు ఆదేశం ప్రకారం జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. నిందితులు స్థానికులతో వాదించగా స్వల్ప ఘర్షణ చోటుచేసుకుందని రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ చెప్పారు.
హోరెత్తిన రాజ్యసభ.. ఈ ఘటనపై బుధవారం రాజ్యసభలో బీఎస్పీ, కాంగ్రెస్ నిరసన తెలిపి, బీజేపీని దుయ్యబట్టాయి. గుజరాత్లో దళిత యువకులను కొట్టిన ఘటన తర్వాత కూడా మధ్యప్రదేశ్లో గో రక్షణ బృందాలు మహిళలను కొట్టడం దారుణమని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ ఘటనకు పోలీసులు మౌన ప్రేక్షకులుగా మారారని ఆరోపించారు. బీఎస్పీ సభ్యులు వెల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. వీరిని కాంగ్రెస్ సభ్యులు కూడా అనుసరించారు. గోరక్షణ పేరుతో దళితులపై దాడి ఘటనపై ప్రధాని ఎందుకు స్పందించలేదని ఆనంద్ శర్మ(కాంగ్రెస్) ప్రశ్నించారు.
గోమాంసం తరలిస్తున్నారని దాడి
Published Thu, Jul 28 2016 2:49 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement