నేటి వార్తా విశేషాలు | Sakshi
Sakshi News home page

నేటి వార్తా విశేషాలు

Published Sun, May 14 2017 8:43 AM

today news updates

నేడు సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవం
హైదరాబాద్‌: సమాజంలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందజేసిన ప్రముఖులకు ప్రతి ఏటా అందజేసే ‘సాక్షి’ ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఫిల్మ్‌నగర్‌ జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది. ప్రముఖ టెలివిజన్‌ జర్నలిస్టు, రచయిత్రి బర్ఖాదత్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

బాధ్యతలు చేపట్టనున్న ఇమ్మాన్యుయేల్‌ మేక్రన్‌
పారిస్: యూరోపియన్‌ యూనియన్‌ అనుకూలవాది, స్వతంత్ర అభ్యర్థి ఇమ్మాన్యుయేల్‌ మేక్రన్‌(39) ఇటీవల జరిగిన ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అతిపిన్నవయసులో అధ్యక్షుడిగా ఎన్నికై ఫ్రాన్స్‌ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మేక్రన్ నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

నేడు రాజన్న క్యాంటీన్ ప్రారంభం
మంగళగిరి: నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజన్న క్యాంటీన్ ప్రారంభం. రూ. 4కే భోజనం, పేదల కోసం సొంత నిధులతో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే).

కొనసాగుతున్న మిశ్రా నిరాహార దీక్ష
ఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో తన ఇంటివద్దే ఆప్ నేత, మాజీ మంత్రి కపిల్ మిశ్రా నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఐదుగురు ఆప్ సీనియర్ నేతల విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను వెల్లడించాలంటూ దీక్ష చేపట్టిన మిశ్రా.

చెన్నైలో పర్యటించనున్న వెంకయ్యనాయుడు
చెన్నై: నేడు చెన్నైలో పర్యటించనున్న కేంద్ర పట్టణాభివృద్ధిమంత్రి వెంకయ్యనాయుడు. చెన్పైలో 7.63 కిలోమీటర్ల మెట్రో రైలు సర్వీసు పనులను ప్రారంభించనున్న వెంకయ్య.

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
యాదాద్రి: బ్రహ్మోత్సవాల నాటికి యాదాద్రి ఆలయ పనులు పూర్తిచేస్తామని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు. పనులు వేగమంతం చేయాలని ఉద్యోగులకు సూచించిన కిషన్ రావు.

ఐపీఎల్ 10 షెడ్యూలు
పుణే: రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో తలపడనున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్. సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం
ఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం
 

Advertisement
Advertisement