ముంబైలో వాహనాలను తగులబెట్టిన ఆందోళనకారులు | Sakshi
Sakshi News home page

ముంబైలో వాహనాలను తగులబెట్టిన ఆందోళనకారులు

Published Fri, Jan 2 2015 1:15 PM

ముంబైలో వాహనాలను తగులబెట్టిన ఆందోళనకారులు

ముంబై: మహానగరం ముంబై అట్టుడుకుతోంది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంపై కొందరు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. శుక్రవారం నిరసనకు చేపట్టిన ఆందోళన కారులు పలు వాహనాలను తగులబెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్త మారడంతో వారిని పోలీసులు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆందోళనకారులపై లాఠీచార్జికి దిగారు.

 

దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లపై కూడా ప్రభావం ఉండటంతో పలు రైళ్లు పాక్షికంగా నిలిచిపో్యాయి. ప్రస్తుతం నాలుగు ట్రాక్ లపై రైళ్లు పూర్తిగా స్తంభించిపోయాయి.

Advertisement
Advertisement