చంద్రబాబుకు వెంకయ్య ఫోన్ కాల్ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు వెంకయ్య ఫోన్ కాల్

Published Wed, Sep 7 2016 12:44 PM

చంద్రబాబుకు వెంకయ్య ఫోన్ కాల్ - Sakshi

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ఫోన్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీపై ఆయన ఈ సందర్భంగా సీఎంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంటూ హస్తినలో హడావుడి జరుగుతోంది. చర్చల ప్రక్రియ అంటూ హఠాత్తుగా హంగామా ప్రారంభమైంది. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఈరోజు ఉదయం ముందుగా వెంకయ్య నాయుడుతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. దీనిపై టీడీపీ అనుకూల మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. హోదాకు సమానమైన ప్యాకేజీ అంటూ ఊదరగొడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు సమక్షంలోనే ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement