కర్నూలు వాసి బాగ్దాద్‌లో మృతి | Sakshi
Sakshi News home page

కర్నూలు వాసి బాగ్దాద్‌లో మృతి

Published Tue, Jun 5 2018 11:55 AM

Kurnool Person Died In Baghdad - Sakshi

కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు నగరానికి చెందిన వ్యక్తి ఆదివారం రాత్రి బాగ్దాద్‌లో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని అక్కడే ఖననం చేస్తుండటంతో కుటుంబ సభ్యులు కడచూపు దర్శనానికి కూడా నోచుకోలేకపోయారు. పూర్తి వివరాలు.. కర్నూలు నగరం ధర్మపేటకు చెందిన టి.దస్తగీర్‌ సాహెబ్‌ (65) ఆర్మీలో 20 ఏళ్లు పనిచేసి రిటైర్‌ అయ్యాడు. ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్‌ మార్కెట్‌యార్డు బ్రాంచ్‌లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం బాగ్దాద్‌ యాత్రకు వెళ్లి అక్కడి పవిత్ర పుణ్యస్థలం మాబుసుభాని (దస్తగీర్‌) సమాధి వద్ద మృతిచెందాడు. ఇమామ్‌ గజాలి రహ్మతుల్లా అలై ఖబరస్తాన్‌లో ఖననం చేశారు. ఈయనకు నలుగురు కుమారులు, కుమార్తె సంతానం.

Advertisement
Advertisement