సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెట్టించిన మాజీ మంత్రి శ్రీధర్బాబు నీచ రాజకీయాలు మానుకోవాలని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు భానుప్రసాద్, గంగాధర్గౌడ్లతో కలసి మీడియాతో మాట్లాడారు.
శ్రీధర్బాబు టీఆర్ఎస్ నేతను గంజాయి కేసులో ఇరికించాలని చూసిన సంగతి ప్రజలకు తెలిసిపోయిందన్నారు. గొప్ప కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకునే శ్రీధర్బాబు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని, చేసిన తప్పులు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. మాజీమంత్రి శ్రీధర్బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.