కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ | Sakshi
Sakshi News home page

బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం

Published Wed, Dec 20 2017 10:12 AM

BJP parliamentary party meting underway  - Sakshi

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని గ్రంథాలయ భవనంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై చర్చిస్తున్నారు.

Advertisement
Advertisement