సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. సర్వేల ప్రకారం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. దీనిపై స్పందిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను అర్థం చేసుకోవడం కంటే కన్ఫ్యూస్ అయ్యే విషయం మరొకటి లేదంటూ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రెండు ఇంగ్లీష్ చానళ్లు బీజేపీ అంటుంటే.. మరో రెండు చానళ్లు కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని చూపిసస్తున్నాయి. కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్లా కనిపిస్తున్నాయంటూ చమత్కరిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తొలుత కాంగ్రెస్కే అవకాశం ఉందన్న చానళ్లు కొద్దిసేపట్లోనే బీజేపీకి అధిక సీట్లు వస్తాయని ఎగ్జిట్ ఫలితాలు అందివ్వడంతో ఏది నమ్మాలో తెలియని స్థితి నెలకొంది.
Nothing can be more confusing than watching the Karnataka exit poll predictions on English news channels 😀
— KTR (@KTRTRS) 12 May 2018
Two channels calling it for BJP & two others to Congress. Looks like the exit polls are hung too 😝