సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/తాడేపల్లిరూరల్ (మంగళగిరి) : ఎన్నికల ప్రచారం పేరుతో మంత్రి లోకేష్ చేస్తున్న కామెడీ షో అప్రతిహతంగా కొనసాగిపోతోంది. ఇటీవల మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మరణవార్త విని పరవశించి పోయా అని వ్యాఖ్యానించి అభాసుపాలైన లోకేశ్.. రెండు రోజుల కిందట తాడేపల్లి మండలం మధురానగర్లో మాట్లాడుతూ ‘‘ మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఏప్రిల్ 9న (ఏప్రిల్ 11న) జరిగే పోలింగ్లో నాకు ఓటు వేసి ఆశీర్వదించండి’’ అని మాట తూలి తన అజ్ఞానాన్ని మరోమారు ప్రదర్శించుకున్నాడు. తాజాగా ఆదివారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం శృంగారపురం, పేరికలపూడిలో నిర్వహించిన సభల్లో మాట్లాడుతూ ‘‘మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోయేందుకు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. మన రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న ఓటర్లంతా అవాక్కయ్యారు. అసలు సముద్రమే లేని రాష్ట్రానికి పోర్టు తీసుకెళ్లి ఏం చేసుకుంటారు.? అని నవ్వుకున్నారు. ఇలాంటి కామెడీ పీస్కి ఎలా ఓటేయాలని మంగళగిరి ఓటర్లు చర్చించుకోవడం గమనార్హం.
రైతులకు పసుపు కుంకుమ!!
ఆదివారం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు ముఖద్వారం వద్ద లోకేష్ మాట్లాడుతూ ‘అక్కల్లారా, చెల్లెల్లారా పసుపు కుంకుమ నగదు పడినియ్యా’ అని అడిగారు. అయితే అక్కడ ఉన్నదంతా రైతులే కావడంతో లోకేష్ మాటలకు వారు నవ్వుకున్నారు. అక్కడ నుంచి రేవేంద్రపాడు గ్రామంలోకి వచ్చిన లోకేష్ అక్కడ అందరూ మహిళలు ఉంటే వారికి రైతు రుణమాఫీ జరిగిందా అని ప్రశ్నించడంతో వారంతా అవాక్కయ్యారు. అనంతరం కాసేపు స్థానిక సమస్యలపై ముక్తసరిగా మాట్లాడిన లోకేష్ షెడ్యూల్లోని మిగతా గ్రామాలకు వెళ్లకుండానే ప్రచారాన్ని ఆపి వెనుదిరిగారు.
లోకేశ్ షోపై సోషల్ మీడియాలో సెటైర్లు..
లోకేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఓ ఆటాడుకుంటోంది. మచిలీపట్నం పోర్టును తెలంగాణ రాష్ట్రానికి తీసుకువెళ్లడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారన్న వ్యాఖ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తెలంగాణలో సముద్రం లేనప్పుడు మచిలీపట్నం పోర్టును తెలంగాణకు ఎలా తీసుకువెళ్తారంటూ సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు. లోకేశ్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న ప్రసంగాలు మంగళగిరి వాసులకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ పెద్దఎత్తున కామెడీ పంచుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Related news
-
Palakollu: నిమ్మలకు హ్యాట్రిక్ గండం
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని హ్యాట్రిక్ గండం వెంటాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల గోపికి లభిస్తున్న జనాదరణ, కూటమిలోని అసమ్మతి సెగలు, వరుసగా మూడోసారి పట్టం కట్టని పాలకొల్లు ప్రజల నాడి ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల్లోనూ చరిత్రే పునరావృతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 70 ఏళ్ల చరిత్ర పాలకొల్లు శాసనసభ నియోజకవర్గానికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. 1955 నుంచి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983, 1985 అలాగే 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అల్లు వెంకటసత్యనారాయణ గెలుపొందారు. అయితే వరుసగా మూడోసారి పోటీచేసిన సందర్భంలో ప్రజలు ఆయన్ను ఓడించారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలుపొందుతూ వచ్చిన రామానాయుడు ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు ఏ అభ్యరి్థకీ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ప్రజలు పట్టం కట్టడం పాలకొల్లు చరిత్రలో లేదు. ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల ప్రచార ఆర్భాటంలో తప్ప అభివృద్ధిలో తనదైన ముద్రను వేసుకోలేకపోయారు. చెప్పుకోదగిన స్థాయిలో ప్రజాసమస్యలను పరిష్కరించలేకపోయారు. అయితే సీఎం జగన్ పాలనలోని ఈ ఐదేళ్లలో కులమత వర్గాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ లబ్ధిని చేకూర్చడంతో పాటు అభివృద్ధి పనుల్లోనూ పాలకొల్లుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పాలకొల్లు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సుమారు రూ.1,440 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా 6.84 లక్షల మంది లబి్ధదారులకు రూ.619 కోట్ల లబ్ధి చేకూరింది. మెడి‘కల’ సాకారం పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 150 మంది విద్యార్థులు కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించనున్నారు. వంద పడకల ఆస్పత్రికి నిధుల మంజూరు లేకుండానే గత ఎన్నికల ముందు ఎమ్మెల్యే నిమ్మల ప్రజలను నమ్మిచేందుకు బోగస్ శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. కాగా సీఎం జగన్ పాలనలో రూ.16.60 కోట్ల వ్యయంతో 150 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టి పూర్తిచేయడం గమనార్హం. రూ.15 కోట్లతో పాలకొల్లులో తాగునీటి ఫిల్టర్ బెడ్ నిర్మించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రచారాస్త్రంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.అసమ్మతి సెగలు ఎమ్మెల్యే నిమ్మల వైఖరిపై కూటమి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్వతహాగా కిందిస్థాయి కేడర్ను ఎదగనివ్వరని ఆయనకు పేరుంది. కూటమిలోని జనసేన, బీజేపీ నేతల విషయంలోను అదే వైఖరిని అవలంబిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి అవసరమైన సామగ్రిని అభ్యర్థి సమకూరుస్తుంటారు. కాగా ప్రచారంలో పాల్గొనే కూటమి నాయకులను ఎవరి పార్టీ జెండాలు వారే తెచ్చుకోవాలని సూచిస్తుండటంతో పాటు ప్రచారం చేసే సమయంలో తనను దాటుకుని ఎవరూ ముందుకు వెళ్లకూడదని ఆయన చెబుతున్నారంట. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీజేపీ పోటీ చేస్తున్న నేపథ్యంలో వారు జెండా ఖర్చులు భరించుకుంటారని, మద్దతు తెలుపుతున్న తమపై ఖర్చులు రుద్దుతున్నారని జనసేన నాయకులు అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం సరిగా చెప్పడం లేదని మండిపడుతున్నారు. నియోజకవర్గంలో పట్టున్న జనసేన పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర చైర్మన్ బన్నీ వాసు ప్రెస్మీట్లకే తప్ప ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబునాయుడు వచ్చిన సందర్భంలో బన్నీవాసును వేదికపైకి రాకుండా అడ్డుకోవడం పట్ల ఆయన మనస్తాపానికి గురై వెళ్లిపోవడంతో మరుసటిరోజు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. ఆ అవమానభారంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. బీజేపీ నేతలకు కూడా నిమ్మల వ్యవహారశైలి మింగుడు పడటం లేదు.ప్రజలతో గోపి మమేకం ఓ పక్క ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల గోపి ప్రజలతో మమేకమవుతుంటే.. ఓటర్లను ఆకట్టుకునే విన్యాసాలే తప్ప చెప్పుకోవడానికి చేసిందేమీ లేదన్నట్టుగా నిమ్మల ప్రచారం సాగుతోందని సొంతగూటి నేతలే చెప్పుకుంటున్నారు. ఒక పక్క అధికార పక్షం జోరు, మరోపక్క పాల కొల్లు సెంటిమెంట్తో చరిత్ర పునరావృతమవుతుందని చెవులు కొరుక్కుంటున్నారు. -
కామినేని కట్టుకథలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒట్టు వేసి ఒక మాట.. వేయకుండా ఒక మాట చెప్పను.. ఇది పాపులర్ సినిమా డైలాగ్. అయితే ఈ నేత మాత్రం ఒట్టు వేసి మరీ చెప్పిన మాటలను అధికారంలోకి రాగానే కొల్లేటిలో కలిపేస్తారు. మళ్లీ ఎన్నికలు రాగానే అవే హామీలు, మాటలను మళ్లీమళ్లీ చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. ఆయనే కైకలూరు బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. తనకు విస్తృత పరిచయాలు ఉన్నాయని.. కొల్లేరు సమస్యలు నరేంద్ర మోదీతో మాట్లాడి సెటిల్ చేస్తానని.. జలజీవన్ మిషన్ మనదేనని.. ఇంటింటికీ మంచినీరు ఇస్తానని ఇలా బిల్డప్ బాబాయ్ మాదిరిగా అడ్డగోలుగా మాటలు చెబుతూ రాజకీయం చేస్తుంటారు. కేవలం మూడు పారీ్టలు ఉంటేనే కూటమి బీజేపీ అభ్యరి్థగా బరిలో నిలవడం, మూడు పారీ్టలు లేకపోతే బీజేపీని స్థానికంగా గాలికి వదిలేసి విదేశాల్లో ఉండటం ఆయనకు సర్వసాధారణం. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇలాంటి మోసపూరిత హామీలు, ఒట్లతో కామినేని కైకలూరులో ప్రచారం చేస్తున్నారు. జెండాలు జతకడితేనే.. కామినేని శ్రీనివాస్ తనని తాను బీజేపీ నేతగా అభివరి్ణంచుకుంటారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యరి్థగా కైకలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయా రు. అయితే బడా వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు, బంధుత్వాలతో బీజేపీ పెద్దాయన సూచనలతో 2014లో బీజేపీలో చేరి కైకలూరు నుంచి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మొదటిసారి గెలిచిన వెంటనే చంద్రబాబు కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగారు. కట్ చేస్తే.. 2019లో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు లేకపోవడంతో హైదరాబాద్, అమెరికాకు పరిమితమై స్థానిక బీజేపీని పూర్తిగా నిరీ్వర్యం చేసి టీడీపీ నేతలకు సహకారం అందించారు. ఫలితంగా టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఐదేళ్ల పాటు కైకలూరు వైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా పొత్తు ఆశలు చిగురించడం, మూడు పార్టీల చర్చలు మొదలు కావడంతో మళ్లీ కైకలూరు తనదేనంటూ హడావుడి మొదలుపెట్టి జెండా.. అజెండా లేకుండా నియోజకవర్గంలో కొద్దిరోజులు తిరిగారు. టికెట్ ఖరారు కావడంతో బీజేపీ అభ్యరి్థగా మళ్లీ తిరుగుతున్నారు. పెద్దింట్లమ్మపై ఒట్టు కామినేని శ్రీనివాస్కు ఒట్లు వేయడం బాగా అలవాటు. ఒక్కోసారి ఒక్కో దేవుడిని వాడుకుంటారు. ఒకసారి కాణిపాకం వినాయకుడు, మరో సారి కైకలూరు శ్యామలాంబ, కొల్లేటికోట పెద్దింట్లమ్మ, ఆయన స్వగ్రామంలో లక్ష్మీనృసింహస్వామి ఇలా అందరిపైనా ఒక రౌండ్ ఒట్లు వేసేశారు. 2014లో కాంటూరు కుదింపు, పెద్దింట్లమ్మ వారధి నిర్మిస్తానని కొల్లేటికోట పెద్దింట్లమ్మపై ఒట్టు వేసి నెరవేర్చని కామినేని తిరిగి మళ్లీ ఇటీవల అమ్మవారిపై కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తానని ఒట్టు వేశారు. చనిపోయిన తన అమ్మ చివరి కోరిక ఎమ్మెల్యే కావడం.. భవిష్యత్తులో ఇక పోటీ చేయనని, ఈసారి కొత్తగా అమ్మ సెంటిమెంట్తో జనాల్లోకి వెళుతున్నారు. -
రెచ్చిపోయిన రౌడీ మూకలు
తిరుపతి నగరంలో అలజడి నెలకొంది. ప్రశాంతంగా ప్రసారం చేసుకుంటున్న వైఎస్సార్సీపీ బీసీ నాయకులపై చిత్తూరు రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయి. దుర్భాషలాడుతూ, మహిళలనీ చూడకుండా వారిని పక్కకు నెడుతూ.. దాడికి దిగడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇంతజరుగుతున్నా సంబంధిత కూటమి అభ్యర్థి వారికి సర్దిచెప్పకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. నిత్యం గోవిందనామస్మరణతో మార్మోగే తిరునగరిలో చిత్తూరు రౌడీ కల్చర్ వద్దుబాబోయ్ అంటూ స్థానికులు నినదిస్తున్నారు. సాక్షి, తిరుపతి : తిరుపతి నగరానికి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరం అని మంచి పేరు ఉంది. ప్రశాంతతకు మారు పేరుగా నిలుస్తోంది. నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఆధ్యాత్మిక నగరంలోకి చిత్తూరు రౌడీయిజం కల్చర్ని తీసుకొచ్చారు. ఇనాళ్లు ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో గత కొన్ని రోజులుగా రౌడీ మూకల అరాచకాలు మితిమీరుతున్నాయి. తిరుపతిలో సమర్థవంతమైన నాయకత్వం లేదని గుర్తించిన జనసేన పార్టీ చిత్తూరు నుంచి వైఎస్సార్సీపీ తిరస్కరించిన ఆరణి శ్రీనివాసులను దిగుమతి చేసుకుని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. తిరుపతికి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన రోజు నుంచే ఇక్కడ రౌడీమూకలు తిష్ట వేశారు.నగరంలోని పలు హోటళ్లు, హోమ్స్టేలు, లాడ్జీలను మే 13 తేదీ వరకు పదుల సంఖ్యలో గదులను రిజర్వ్ చేసుకున్నారు. చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కరుడుగట్టిన నేరగాళ్లను తిరుపతిలో దింపినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అతని వద్ద పనిచేసే వందలాది మందిని సైతం ఇక్కడ తిష్ట వేయించారు. ప్రచార ముసుగులో ఆయా ప్రాంతాల్లో పర్యటించే క్రమంలో మద్యం మత్తులో ఉన్న రౌడీ మూకలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే వారి వివరాలు సేకరించి దాడులకు దతెగబడుతున్నారు. అల్లరి మూకల కదలికలపై దృష్టి సారించాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వరుసుగా దాడులు జనసేన పార్టీ అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు ప్రకటించి తిరుపతికి దిగుమతి అయిన రోజు నుంచి తిరుపతిలో అల్లరిమూకల తాకిడి ఎక్కువైయింది. మద్యం మత్తులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, వైఎస్సార్సీపీ నాయకులపైకి దాడులకు దిగడం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటివి ఇక్కడ సర్వసాధారణమైపోయాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ వైఎస్సార్సీపీ యువనాయకుడిపై టీడీపీ మూకలతో కలిసి చిత్తూరు రౌడీలు దాడికి తెగబడ్డారు. ప్రస్తుతం ఆ యువకుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అలాగే నాలుగు రోజుల క్రితం డబ్బులు పంచుతున్నట్లు సమాచారం రావడంతో సాక్షి ఫొటో గ్రాఫర్, సాక్షి టీవీ రిపోర్టర్ ఖాదీకాలనీకి వెళ్లారు. ఫొటోలు తీసే క్రమంలో చిత్తూరు రౌడీలు వారిపై దాడికి దిగారు. కెమెరా, మొబైల్ లాక్కుని బీభత్సం సృష్టించారు. స్థానికులు కలగజేసుకుని ఈ దౌర్జన్యమేంటని నిలదీశారు. జీవకోనకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడిని జనసేనలోకి రావాలని తీవ్ర ప్రలోభాలకు గురిచేశారు. ఆ వ్యక్తి ససేమిర అనడంతో నీ అంతు చూస్తామంటూ చిత్తూరు రౌడీమూకలు హెచ్చరించారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. రాబోయే రోజుల్లో చిత్తూరు రౌడీలు ఇంకెన్ని దాడులకు పాల్పడుతారోనన్న చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ బీసీ నేతలపై దాడి తిరుపతి గిరిపురంలో శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అదే ప్రాంతంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఇతర ప్రాంతాల వాసులు, అల్లరి మూకలతో ప్రచారానికి వచ్చారు. ఈ క్రమంలో ఇరుపారీ్టల నేతలు తారసపడ్డారు. స్థానిక వైఎస్సార్సీపీ బీసీ నాయకులు ప్రచారం చేస్తుండగా ఎదురొచ్చిన చిత్తూరు రౌడీమూకలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. స్థానిక బీసీ మహిళా నాయకురాళ్లు ఒకరినొకరు సముదాయించుకుని సమన్వయం పాటించాలని సరి్థచెప్పుకున్నారు. అయితే ప్రచారంలో గుంపుగా ఉన్న బీసీ నాయకులు, మహిళలపైకి అల్లరిమూకలు దూసుకొచ్చారు.పక్కకు నెడుతూ నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. మద్యం మత్తులో ఉన్న చిత్తూరు రౌడీలు నలుగురు మహిళలపై దౌర్జన్యానికి దిగి చెయ్యి చేసుకున్నారు. రెచ్చగొడుతూ మరింత ముందుకు దూసుకురావడంతో అక్కడ తీవ్ర అలజడి నెలకొంది. జనసేన అభ్యర్థి అక్కడే ఉన్నా తన అనుచరవర్గం, అల్లరిమూకలను అదుపు చేయపోవడం పట్ల నగర వాసులు మండిపడుతున్నారు. ఈ చిత్తూరు రౌడీయిజం కల్చర్ మా కొద్దు బాబోయ్ అంటూ నినదించారు. బీసీ నాయకులు, మహిళలతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో వివాదం సద్దుమణిగింది. -
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్తో వైఎస్సార్సీపీలో జోష్ -
వావ్ వాటే టెక్నాలజీ..కేసీఆర్ బస్సులో లిఫ్ట్
వావ్ వాటే టెక్నాలజీ..కేసీఆర్ బస్సులో లిఫ్ట్
Related News by category
-
నవాబుల అరాచకలు గుర్తులేవా..? ప్రధాని మోదీ
బెళగావి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. రాజులు, మహారాజులను రాహుల్ అవమానించారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తాన్ల అరాచకాలపై మాత్రం రాహుల్ మౌనంగా ఉన్నారన్నారు. బెళగావిలో ఆదివారం(ఏప్రిల్28) నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాల పుస్తకాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా రాసుకుందని మండిపడ్డారు. రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ వ్యాఖ్యానించి ఛత్రపతి శివాజీ మహారాజ్, కిత్తూరు రాణి చన్నమ్మలను ఆయన అవమానించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాజులను కించపరిచారన్నారు. నవాబులు, సుల్తానుల దౌర్జన్యాలపై మాత్రం నోరెత్తలేదని విమర్శించారు. మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు ఎన్నో దేవాలయాలను అపవిత్రం చేసి ధ్వంసం చేసిన విషయం రాహుల్కు గుర్తులేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందన్నారు. ఇటీవల జరిగిన గొడవలు కర్ణాటక కీర్తి, ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాయన్నారు. -
మేనిఫెస్టోలో లేని విషయాలను మోదీ చెబుతున్నారు: చిదంబరం
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్ మేనిఫెస్టో మీద కీలకవ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో 'వారసత్వ పన్ను' అనే పదం ఎక్కడా లేదని మాజీ ఆర్ధిక మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. మేము రూపొందించని ఒక మేనిఫెస్టోను వారే క్రియేట్ చేసుకుని సభల్లో చెప్పుకుంటున్నారని చిదంబరం అన్నారు. ఈ అంశాలపైన మోదీ చర్చించాలని డిమాండ్ చేశారు.సామ్ పిట్రోడా ప్రస్తావించిన 'వారసత్వ పన్ను' వ్యాఖ్యలపై ప్రధాని పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడతున్న నేపధ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు మేనిఫెస్టోలో లేని అంశాలను గురించి మోదీ ప్రస్తావించడం ఏ మాత్రం సరికాదని చిదంబరం అన్నారు.మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే చాలా విపరీతాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు.The Hon'ble Prime Minister continues to discover and read in the Congress' Manifesto words and sentences that are not there! He has imagined a Congress' Manifesto written by one of his ghost speech writers.The phrase 'inheritance tax' does not occur anywhere in the Manifesto.…— P. Chidambaram (@PChidambaram_IN) April 28, 2024 -
ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అడ్డగోలు హామీలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: తమ మేనిఫెస్టో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేదిలా ఉండదని.. ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాయిళాలు ప్రకటించి ఓట్లు వేయించుకునే ఆలోచనలు తమకు ఉండవని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని సజ్జల మండిపడ్డారు‘‘2014-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. చంద్రబాబువి సభ్యసమాజంలో ఉండగలిగే వ్యక్తి మాటలులాగా లేవు. రాళ్ల దాడి చేయమని గతంలో చంద్రబాబు అన్నాడు.. అన్నట్టుగానే రాళ్లతో దాడి చేయించాడు. మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో మేలు జరిగింది. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు తెస్తానని ఎలా చెప్తున్నారు’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘అమలు చేసే వారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారే చేయగలిగిన హామీలు ఇస్తారు. చంద్రబాబు వలన వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ ఉద్యోగులను పంపించి పెన్షన్లు ఇవ్వమంటున్నారు. పేదలంతా తమ కాళ్ల మీద తాము నిలపడేలా చూడాలన్నది జగన్ ఇద్దేశం. 70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఏకంగా లక్షన్నర కోట్లు చేస్తానంటూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా చంద్రబాబు అబద్ధాల హామీలు ఇస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు.‘‘ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు లాగా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వమని కొంతమంది మాతో కూడా అన్నారు.కానీ జగన్ ఎప్పుడూ చేయలేని పని చెప్పరు. ఇచ్చిన హామీ నుంచి వెనక్కి పోరు. ఎగ్గొట్టాలనుకునే చంద్రబాబు అడ్డమైన హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి. జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి. చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తే తమ ఓటును తాము వృథా చేసుకున్నట్టే. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారు?’’ అంటూ సజ్జల నిలదీశారు.‘‘జగన్ పాలనలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరు. కుప్పంతో సహా ఎక్కడైనా చెక్ చేసేందుకు సిద్దమే. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఇరవై ఇళ్లకు వెళ్లి అడిగే ధైర్యం ఉందా?. పోలవరం పాపం చంద్రబాబుదే. లోకేష్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకు ప్రజలకు కనపడటం లేదు?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. చంద్రబాబు మాటలే పవన్ కూడా మాట్లాడతారు. సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టామని కూడా పవన్ అన్నారు. రాజధానిలోని పొలాలను తాకట్టు పెట్టిందే చంద్రబాబు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు. -
కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: సీఎం సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటకలో ఉన్న మొత్తం 28 లోక్సభ స్థానాలకు రెండో దశ ఎన్నికల్లో 14 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మిగిలిన మరో 14 స్థానాలకు మూడో దశలో మే 07న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆదివారం ఇక్కడ ధర్నాకు దిగారు.కరువు సహాయ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని సిద్దరామయ్య పేర్కొన్నారు. విధానసౌధ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట వీరంతా ధర్నా నిర్వహించారు.కర్ణాటకలోని మొత్తం 236 తాలూకాల్లో 226 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, 48 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని మంత్రులు పేర్కొన్నారు. కరువు సహాయం కోసం రూ. 18,171 కోట్లు డిమాండ్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3454 కోట్లు మాత్రమే విడుదల చేయడానికి సిద్దమైనట్లు వెల్లడించారు. ఈ మొత్తం రాష్ట్ర డిమాండ్లో నాలుగో వంతు కూడా లేదని ఆయన పేర్కొన్నారు. -
నాయకుడి రూపం...గారడీ వేషం
మాటలది ఏముంది..ఏమైనా చెప్పొచ్చు ఎన్నైనా చెప్పొచ్చు..మబ్బులు తెచ్చి ఒళ్ళో పోస్తాను అనొచ్చు.. జాబిల్లిని తెచ్చి చేతికి ఇస్తామనోచ్చు. కానీ నిజంగా ఆ మాట నిలుపుకున్నపుడు కదా ఆ మాటకు, ఇచ్చినవాడికి విలువ.. రాజకీయంగా చూస్తే చంద్రబాబు గత నలభయ్యేళ్లుగా ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు... అసలు మేనిఫెస్టో అనేది ఆయనకు ఒక చిత్తుకాగితంతో సమానం. ఎన్నికలప్పుడు వెయ్యిమాటలు చెప్పడం.. ఒక్కటంటే ఒక్కటీ చేయకుండా..మాయమాటలతో పూటగడిపేయడం...మళ్ళీ అవే హామీలను ఇస్తూ మరో ఎన్నికకు సిద్ధం కావడం..అదే అయన కెరీర్ మొత్తం..సాగిపోయింది.2014 లో కూడా ఇలాగే రైతు రుణమాఫీ... డ్వాక్రా రుణ మాపీ....నిరుద్యోగ భృతి అంటూ వందలాది పథకాల పేర్లు చెప్పి ఓట్లేయించుకుని చివరకు మేనిఫెస్టో కూడా దొరక్కుండా దాచేసారు. మళ్ళీ ఇప్పుడు అదే హామీలు ఇస్తూ 2024 ఎన్నికలకు చంద్రబాబు.. జనసేనాని కలిపి సిద్ధం అవుతున్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ ఐతే నవరత్నాలు అంటూ తాను అమలు చేయగలిగే హామీలు మాత్రమే జాబితాలో చేర్చి వాటిని తూచా తప్పకుండా అమలు చేసారు.. అమ్మఒడి, ఆసరా.. సున్నా వడ్డీ , రైతు భరోసా.. జగనన్న విద్యా దీవెన , విద్యా కనుక, ముప్పై లక్షలమందికి ఇళ్ళు, కాపునేస్తం...ఇలా జాబితాలో చేర్చినవన్నీ చేసుకుంటూ వెళ్లారు.. ఆర్థికంగా అది ఖజానాకు భారమే అయినా ప్రజలకు మాట ఇచ్చాము కాబట్టి ఎలాగైనా చేయాలన్న పట్టుదల, తలంపుతో రెండేళ్లు కోవిద్ కారణంగా ఖజానా వట్టిపోయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గకుండా పథకాలు ఇచ్చారు.ఈ ఎన్నికలకు సైతం తాను చేయగలిగేవే చేస్తాను అంటూ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ కానుకలను మాత్రం మరింతగా పెంపుదల చేస్తాను అని చెప్పారు. ఇక చంద్రబాబు మాత్రం ఎలాగూ అమలు చేయరు కాబట్టి... అలవిమాలిన హామీలన్నీ ఇస్తున్నారు...కానీ చేయి చాచి సాయం చేసేది ఎవరు... వట్టినే నోటితో మాటలు చెప్పి చేతల్లో సున్నా చుట్టేది ఎవరన్నది ప్రజలకు తెలుసు... చంద్రబాబును గత పదేళ్లుగా గమనిస్తున్న వాళ్లందరికీ అయన నిజరూపం ఏమిటన్నది తెలుసు..అందుకే అయన ఎన్ని హామీలిచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక జగన్ పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పులపాల్జేస్తున్నారు అని ఆరోపించేవాళ్లకు చంద్రబాబు ఇస్తున్న భారీ హామీలు కనిపించవా ? అయన లక్షలకోట్ల ఇచ్చుకుంటూ పొతే రాష్ట్రం మరింత కుదేలవదా అనే చర్చ కూడా మొదలైంది. ఈ క్రమంలో ఇప్పుడున్న పథకాలు ఇవ్వడమే గొప్ప... అది కూడా జగన్ ఒక్కడే చేస్తారు... వేరేవాళ్లకు సాధ్యం కాదని అవగతం చేసుకున్న ప్రజలు మళ్ళీ జగన్ మాత్రమే మనకు ఉండాలి అని నిర్ణయించుకున్నారు. -సిమ్మాదిరప్పన్న
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement