రాజకీయాలపై నో కామెంట్‌ | Sakshi
Sakshi News home page

రాజకీయాలపై నో కామెంట్‌

Published Sat, Dec 30 2017 1:17 AM

No comment on Dravida politics says Rajinikanth - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: మనిషిలోని మంచి గుణాలే ఇతరుల వద్ద విలువను పెంచుతాయని సినీ నటుడు రజనీకాంత్‌ చెప్పారు. సమయం వచ్చినపుడు సినిమా, రాజకీయాలు తనకు తానుగా మారిపోతాయన్నారు. అభిమానులతో నాల్గోరోజు సమావేశాలను ఆయన శుక్రవారం నిర్వహించారు.

ఇంటి వద్ద రజనీని కలసిన మీడియా.. ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా తమిళనాడులో రాజకీయాలు సాధ్యమా? అని ప్రశ్నించగా ‘నో కామెంట్స్‌’ అని వెళ్లిపోయారు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్‌ తమిళనాడు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారంటే వారిలోని గుణగణాలే కారణమన్నారు. నటుడుగా ఎదిగే సమయంలో శివాజీ గణేశన్‌తో తన అనుభవాలను వివరించారు.

రజనీకాంత్‌కు విజ్ఞప్తి
నటుడు ధనుష్‌ తమ కన్నబిడ్డ అంటూ కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్న మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులను గౌరవించండి, వారే ప్రత్యక్ష దైవాలు అని అభిమానులకు ఉద్బోధిస్తున్న రజనీకాంత్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అలాగే తమ కన్నబిడ్డైన ధనుష్‌ను కలసి మాట్లాడేందుకు రజనీ అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement