టీఆర్‌ఎస్‌ ఎంపీలు చవటలు, దద్దమ్మలు | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎంపీలు చవటలు, దద్దమ్మలు

Published Sun, Feb 18 2018 2:58 AM

ponnam prabhakar commented over trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను అవమానించే విధంగా ప్రధాని మోదీ మాట్లాడినా కనీసం నోరెత్తకుండా ఉన్న టీఆర్‌ఎస్‌ ఎంపీలు చవటలు, దద్దమ్మలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. వారికి గాజులు, పసుపు, కుంకుమ పంపే రోజులు దగ్గర పడ్డాయని ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీలకు మాట్లాడటం చేతగాకపోతే రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవాలన్నారు. తన ప్రసంగం చివర్లో ‘జై ఆంధ్ర’ అన్న ఎంపీ కవితను చూసి తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని పొన్నం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ కలిసిన తర్వాత దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్‌ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ మాట్లాడుతూ, తెలంగాణ ఆకాంక్షలను మోదీ కించపరుస్తుంటే టీఆర్‌ఎస్‌ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు.

Advertisement
Advertisement