నాడు మేం హోదా అంటే హేళన చేశావే.. | Sakshi
Sakshi News home page

నాడు మేం హోదా అంటే హేళన చేశావే..

Published Wed, Mar 7 2018 3:14 AM

Rajendranath reddy commented over chandrababu naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్యాకేజీ బ్రహ్మాండం అని పొగిడిన నోటితోనే సీఎం చంద్రబాబు హోదా కావాలని ఇపుడు మాట్లాడుతున్నారని, గతంలో ప్రతిపక్షం హోదా కావాలంటే అవహేళన చేశారని ఏపీ పబ్లిక్‌ ఎక్కౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం లో మంగళవారం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ 2017లో గవర్నర్‌ ప్రసంగానికి ఈ ఏడాది ప్రసంగానికి చాలా తేడాలున్నాయన్నారు.

2017 గవర్నర్‌ ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సహకారం అందించటంపై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారన్నారు. ప్రత్యేక ప్యాకేజీని కేంద్రంతో మాట్లాడి సాధించామన్నారన్నారు. మరి 2018లో గవర్నర్‌ ప్రసంగంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలు అమలు కాలేదని,  హోదా కావాలని గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించారన్నారు. ఈ రోజు హోదాపై చంద్రబాబు మాట్లాడుతున్న ప్రతి మాటా నాడు జగన్‌ చెప్పిందే కదా అని బుగ్గన గుర్తు చేశారు.

Advertisement
Advertisement