సాక్షి, వరంగల్ రూరల్: పరకాల నుంచి కొండా సురేఖ, వరంగల్ తూర్పు నుంచి తమ కుమార్తె సుస్మితా పటేల్ బరిలో ఉంటారని కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు చెప్పినట్లు తెలిసింది. సోమవారం కొండా దంపతులు హన్మకొండకు వచ్చారు. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చిన అభిమానులతో మురళీధర్రావు సమావేశమయ్యారు. మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ నెల 23న ఆత్మకూరులో బహిరంగ సభ పెడదామని చెప్పినట్లు తెలిసింది.
నేడు బహిరంగ లేఖ!
ఈ నెల 8న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్కు కొండా దంపతులు పలు డిమాండ్లు చేశారు. ఈ డిమాండ్లకు సమాధానం చెప్పకపోతే కేసీఆర్కు బహిరంగ లేఖ రాస్తామని ప్రకటించారు. నేడు హైదరాబాద్లో ఈ లేఖను విడుదల చేయనున్నారని తెలిసింది.
పరకాలకు సురేఖ.. తూర్పు నుంచి సుస్మితా!
Published Tue, Sep 11 2018 2:52 AM
# Tag
Related news
-
లావుగా ఉన్నావంటూ బిడ్డతో సహా భార్యను వదిలేశాడు..కానీ ఆమె..!
ప్రతి ఆడపిల్ల పెళ్లి తర్వాత జీవతం గురించి ఎన్నో కలలు కంటుంది. అందరికి మెట్టినిల్లు పుట్టినిల్లులా ఉండకపోవచ్చు. కొందరికి అది ముళ్లమీద సాగుతున్న జీవితంలా ఉండొచ్చు. అయినప్పటికి పుట్టింటి గౌరవం కాపాడేందుకు అన్నింటిని ఓర్చుకుంటుంది. కానీ అది హద్దు దాటి ఆమె ఆత్మగౌరవాన్నే కించే పరిచలే చేస్తే తట్టుకోలేదు. అదికూడ కట్టుకున్నవాడే తన ఉనికినే సహించలేనంటే.. ఆ మహిళ పరిస్థితి మాటలకందని వేదన అని చెప్పొచ్చు. అలాంటివి అధిగమించి తానెంటో ప్రూవ్ చేసుకున్న ఓ ధీర వనిత గాథ ఇది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళ స్ఫూర్తి కథేంటో చూద్దామా!. 32 ఏళ్ల సుస్మితా దాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందరి ఆడపిల్లలా పెళ్లి గురించి ఎన్నో కలలు కంది. ఎంతో ఆనందంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తమ ప్రేమకు గుర్తుగా పండంటి బాబుని కంది. అదే ఆమె పాలిట శాపంగా మారి వైవాహిక జీవితాన్ని నిలువునా కూలుస్తుందని ఊహించలేదు. సాధారణంగా ప్రసవానంతరం వచ్చే మహిళల్లో చాలా మార్పులు వస్తాయి. కొందరూ బాగా లావవ్వడం జరుగుతుంది. పిల్లలు ఎదిగే క్రమంలో కొందరూ తగ్గుతారు, మరికొందరూ కాస్త శరీరంపై దృష్టిపెట్టి తగ్గించుకోవడం వంటివి చేస్తారు. అలానే సుస్మిత డెలివరీ తర్వాత ఊహించిన విధంగా బరువు పెరిగింది. ఈ శరీర మార్పులను అంగీకరించకపోగా బాషీ షేమింగ్తో ఇబ్బంది పెట్టేవాడు. లావుగా ఉన్న నీతో కాపురం చేయలేను అని బిడ్డతో సహా ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మానసికంగా కుంగిపోయింది. ఏం చేయాలో ఎలా లైప్ లీడ్ చేయాలో తెలియని అగమ్య గోచరంలా కనిపించింది కళ్లముందున్న జీవితం. తల్లిదండ్రులు సుస్మితను అక్కున చేరుకుని భరోసా ఇచ్చారు. అది ఆమెలో కొండంత ధైర్యం ఇచ్చింది. ఏ బాడీ షేమింగ్ కారణంగా తన జీవితాన్ని కోల్పోయానో దాని మీద దృష్టిపెట్టి మంచి ఫిట్నెస్గా ఉండాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. ఫిట్నెస్ కమ్యూనిటీలో ఓ మెంబర్గా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఏ ఒక్క రోజు వర్కౌట్లు మిస్సవ్వదు. అందరికంటే ఎక్కువ బరువులు అలవోక ఎత్తేయగలదు. పైగా తాను పెళ్లి కారణంగా మధ్యలోనే ఆపేసిన ఎంబీఏని చదువుని పూర్తి చేయడమే గాక మంచి కార్పోరేట కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించడమే గాకు తన కుంటుంబాన్ని పోషించుకుంటోంది. అంతేగాదు తనలా బాడీషేమింగ్తో బాధపడే మహిళలకు మంచి ఫిట్నెస్ గురువుగా సలహలిస్తూ వారిని మంచి టోన్డ్ బాడీగా మార్చుకునేలా సాయం చేస్తోంది. అలా మహిళలను కించపరచడం తప్పని నిరూపించడమేగాక వారు తమను తాము ప్రేమించుకుంటేనే ధైర్యంగా నిలబడగలరని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. (చదవండి: మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?) -
మీసం మెలేసిన కొండా.. తొడగొట్టిన ఇనగాల
సాక్షి, హనుమకొండ: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మీసం మెలేయగా.. మరో నేత ఇనగాల వెంకట్రామ్రెడ్డి తొడకొట్టడం.. ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు...వెరసి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఆత్మకూర్ మండలం అగ్రంపహాడ్లోని జరిగిన సమావేశానికి పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ రవీంద్ర ఉత్తమ్రావు దల్వీ హాజరయ్యారు. సమావేశం ప్రారంభంకాగానే మాజీ ఎమ్మెల్సీ కొండా, పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి వర్గీయులు.. పోటాపోటీ నినాదాలు చేశారు. పీసీసీ సీనియర్ వైస్ప్రెసిడెంట్ శోభారాణి కలగజేసుకుని వ్యక్తిగత నినాదాలు చేయొద్దని.. పార్టీ నినాదాలు, జాతీయ నేతల నినాదాలు చేయాలని చెప్పినా ఫలితం కనిపించలేదు. నినాదాలు చేస్తే పంపిస్తామని చెప్పినా కార్యకర్తలు శాంతించలేదు. దీంతో మధ్యలోనే దల్వీ కార్యకర్తలను ఉదేశించి మాట్లాడి వెళ్లిపోయారు. ఆయనతో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బయటికి వెళ్లిపోవడంతో సమావేశం ముగిసింది. సమావేశప్రాంగణం బయట కొండా, ఇనగాల ఒకరినొకరు ఎదురు పడ్డారు. ఆ సమయంలో కొండా మీసం మెలేయడం, ఇనగాల తొడ గట్టడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు? -
ధర్మారెడ్డి.. తరిమికొట్టడం నీకేం తెలుసు.. తరిమికొట్టడమంటే కొండా మురళీకి తెలుసు..
వరంగల్ : ‘ధర్మారెడ్డి.. తరిమికొట్టడం నీకేం తెలుసు.. తరిమికొట్టడమంటే కొండా మురళీకి తెలుసు.. మా కార్యకర్తలు నిన్ను ఉరికిస్తరు.. మైసమ్మ సాక్షిగా చెబుతున్నా.. పరకాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలుచున్నా నిన్ను ఓడిస్తా’ ఖబర్దార్ అంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు చల్లాపై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్పై కొండామురళి వ్యాఖ్యలను ఖండిస్తూ చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. దీనిపై స్పందిస్తూ మంగళవారం వరంగల్ రత్నహోటల్లో కొండామురళి విలేకరుల సమావేశంలో ప్రతి విమర్శలు చేశారు. ‘ధర్మారెడ్డి నువ్వు నా ఇంటికి వచ్చి బతిమిలాడి రూ. 14 కోట్ల విలువైన ప్రగతి సింగారం బ్రిడ్జి పనులు తీసుకోలేదా’ అని గుర్తు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చలివాగు ప్రాజెక్టు, శాయంపేట మండల కేంద్రంలో 14 ఎకరాల్లో మోడల్ కాలేజీ, ఆత్మకూర్ పోలీస్స్టేషన్కు స్థలం ఈ పనులన్నీ తానే చేశానని, ఎమ్మెల్యే చేసింది ఏమిటని ప్రశ్నించారు. అక్రమాలను వెలికితీసే జర్నలిస్టులకే ఈ ప్రభుత్వంలో రక్షణ కరువైతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందన్నారు. మహిళలను అవమానించి కేసులు నమోదు చేయించే సంస్కృతి ధర్మారెడ్డి అయితే.. వారికి అండగా నిలిచే సంస్కృతి తనదన్నారు. ‘పరకాల ప్రజలకు నీ గురించి గొప్పగా తెలుసు.. నువ్వో మట్టి దొంగవు’ అని ఎద్దేవా చేశారు. మట్టి తీయడం, మొరం తీసి అమ్మడం, కాంట్రాక్టు పనుల్లో పర్సంటేజీ నొక్కడం ఇది ఎమ్మెల్యే సంస్కృతి అని మండిపడ్డారు. తూర్పులో కొండా సురేఖను, పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి తానే గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తూర్పు, పరకాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మొగోడివైతే మీసాలు మెలేయాలి.. మెలేయడానికి నీకు మీసాలు లేవు..
రామన్నపేట : ‘కొమ్మాల లక్ష్మీనరసింహస్వామికి మీసాలు ఉంటాయి.. కొండా మురళీకి మీసాలు ఉంటాయి.. మొగోడివైతే మీసాలు మెలేయాలి.. మెలేయడానికి నీకు మీసాలు లేవు శ్రీ.. కేటీఆర్ ఖబర్దార్.. అంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు అన్నారు. వరంగల్లో శనివారం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యాలపై ఆయన ఆదివారం స్పందించారు. పోచమ్మమైదాన్లోని రత్నహోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొండా దంపతులు పారిపోయిల్లు అంటున్నవ్.. వరంగల్లో బస్వరాజు సారయ్యను ఓడించాలంటే మీరైతేనే సాధ్యమని మీ అయ్య తూర్పు నియోజకవర్గానికి పంపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కొండా మురళీ గుండా.. రౌడీ అంటున్నావు.. ఆ రోజు ఎమ్మెల్సీ పదవి ఏకగీవ్రంగా ఎన్నికై నప్పుడు గుర్తుకు లేదా అంటూ మండిపడ్డారు. మమ్ముల్ని మీరు పిలిచారా.. మేము నీ దగ్గరికి వచ్చా మా గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు. ‘నాకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టే తరాజు జోకేటోడు(మంత్రి దయాకర్రావు) పార్టీలోకి వస్తే మేము బయటికి వచ్చాం. కంపెనీల పేరుతో ఏడేళ్ల కింద రైతుల నుంచి భూములు తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అప్పటి నుంచి చేయనిది.. ఐదు నె లలో పూర్తి చేస్తారా.. మాయమాటలతో ప్రజలను మోసం చే యవద్దంటూ’ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఐదు నెలల్లో కాంగ్రెస్ పార్టీ విజయం త థ్యమని పేర్కొన్నారు. ఆ తరువాత విజయమాల్యా మాది రిగి కేటీఆర్ విదేశాలకు పారిపోవడం ఖాయమని చెప్పారు. సిరిసిల్లలోనే నీ పరిస్థితి బాగా లేదు.. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నవా అంటూ ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖతో పాటు పరకాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత నాదే అంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాశ్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చిన్న సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న యంగ్ లేడీ ప్రొడ్యూసర్స్
చిన్న సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న యంగ్ లేడీ ప్రొడ్యూసర్స్
Related News by category
-
దొందూ.. దొందే, సీపీఐ.. కాంగ్రెస్పై దీదీ విమర్శలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీకి.. కాంగ్రెస్, సీపీఐలు రెండు కళ్లులాంటివని సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.మాల్దా జిల్లా ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోందని సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ పోరాటం చేస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత భారత కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.‘బెంగాల్లో కాంగ్రెస్తో మాకు పొత్తు లేదు. ఇక్కడ సీపీఎం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. రెండూ బీజేపీతో చేతులు కలిపినట్లు, మీరు (ఓటర్లు) కాంగ్రెస్ లేదా సీపీఐ(ఎం)కి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తగ్గించుకోవడం, మోదీకి సహాయం చేయడం ఆ రెండు పార్టీల లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి.. కాంగ్రెస్, సీపీఐలు రెండు కళ్లులాంటివని’ దీదీ ఆరోపించారు.పశ్చిమ బెంగాల్లోని కాంగ్రెస్, సీపీఐ నాయకులు బీజేపీ స్వరంతో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాపాలనను నడుపుతున్న టీఎంసీ విధానాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు.దేశంలో ప్రతిపక్షాల కూటమి బలంగా ఉంది. దానికి ఇండియా కూటమి అని పేరు పెట్టింది నేనే. కానీ బెంగాల్లో కూటమి ఉనికిలో లేదు. దాని రాష్ట్ర నాయకులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దీదీ మండిపడ్డారు. -
నవాబుల అరాచకలు గుర్తులేవా..? ప్రధాని మోదీ
బెళగావి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. రాజులు, మహారాజులను రాహుల్ అవమానించారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తాన్ల అరాచకాలపై మాత్రం రాహుల్ మౌనంగా ఉన్నారన్నారు. బెళగావిలో ఆదివారం(ఏప్రిల్28) నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాల పుస్తకాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా రాసుకుందని మండిపడ్డారు. రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ వ్యాఖ్యానించి ఛత్రపతి శివాజీ మహారాజ్, కిత్తూరు రాణి చన్నమ్మలను ఆయన అవమానించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాజులను కించపరిచారన్నారు. నవాబులు, సుల్తానుల దౌర్జన్యాలపై మాత్రం నోరెత్తలేదని విమర్శించారు. మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు ఎన్నో దేవాలయాలను అపవిత్రం చేసి ధ్వంసం చేసిన విషయం రాహుల్కు గుర్తులేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందన్నారు. ఇటీవల జరిగిన గొడవలు కర్ణాటక కీర్తి, ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాయన్నారు. -
మేనిఫెస్టోలో లేని విషయాలను మోదీ చెబుతున్నారు: చిదంబరం
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్ మేనిఫెస్టో మీద కీలకవ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో 'వారసత్వ పన్ను' అనే పదం ఎక్కడా లేదని మాజీ ఆర్ధిక మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. మేము రూపొందించని ఒక మేనిఫెస్టోను వారే క్రియేట్ చేసుకుని సభల్లో చెప్పుకుంటున్నారని చిదంబరం అన్నారు. ఈ అంశాలపైన మోదీ చర్చించాలని డిమాండ్ చేశారు.సామ్ పిట్రోడా ప్రస్తావించిన 'వారసత్వ పన్ను' వ్యాఖ్యలపై ప్రధాని పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడతున్న నేపధ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు మేనిఫెస్టోలో లేని అంశాలను గురించి మోదీ ప్రస్తావించడం ఏ మాత్రం సరికాదని చిదంబరం అన్నారు.మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే చాలా విపరీతాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు.The Hon'ble Prime Minister continues to discover and read in the Congress' Manifesto words and sentences that are not there! He has imagined a Congress' Manifesto written by one of his ghost speech writers.The phrase 'inheritance tax' does not occur anywhere in the Manifesto.…— P. Chidambaram (@PChidambaram_IN) April 28, 2024 -
ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అడ్డగోలు హామీలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: తమ మేనిఫెస్టో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేదిలా ఉండదని.. ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాయిళాలు ప్రకటించి ఓట్లు వేయించుకునే ఆలోచనలు తమకు ఉండవని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని సజ్జల మండిపడ్డారు‘‘2014-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. చంద్రబాబువి సభ్యసమాజంలో ఉండగలిగే వ్యక్తి మాటలులాగా లేవు. రాళ్ల దాడి చేయమని గతంలో చంద్రబాబు అన్నాడు.. అన్నట్టుగానే రాళ్లతో దాడి చేయించాడు. మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో మేలు జరిగింది. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు తెస్తానని ఎలా చెప్తున్నారు’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘అమలు చేసే వారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారే చేయగలిగిన హామీలు ఇస్తారు. చంద్రబాబు వలన వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ ఉద్యోగులను పంపించి పెన్షన్లు ఇవ్వమంటున్నారు. పేదలంతా తమ కాళ్ల మీద తాము నిలపడేలా చూడాలన్నది జగన్ ఇద్దేశం. 70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఏకంగా లక్షన్నర కోట్లు చేస్తానంటూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా చంద్రబాబు అబద్ధాల హామీలు ఇస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు.‘‘ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు లాగా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వమని కొంతమంది మాతో కూడా అన్నారు.కానీ జగన్ ఎప్పుడూ చేయలేని పని చెప్పరు. ఇచ్చిన హామీ నుంచి వెనక్కి పోరు. ఎగ్గొట్టాలనుకునే చంద్రబాబు అడ్డమైన హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి. జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి. చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తే తమ ఓటును తాము వృథా చేసుకున్నట్టే. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారు?’’ అంటూ సజ్జల నిలదీశారు.‘‘జగన్ పాలనలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరు. కుప్పంతో సహా ఎక్కడైనా చెక్ చేసేందుకు సిద్దమే. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఇరవై ఇళ్లకు వెళ్లి అడిగే ధైర్యం ఉందా?. పోలవరం పాపం చంద్రబాబుదే. లోకేష్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకు ప్రజలకు కనపడటం లేదు?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. చంద్రబాబు మాటలే పవన్ కూడా మాట్లాడతారు. సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టామని కూడా పవన్ అన్నారు. రాజధానిలోని పొలాలను తాకట్టు పెట్టిందే చంద్రబాబు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు. -
కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: సీఎం సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటకలో ఉన్న మొత్తం 28 లోక్సభ స్థానాలకు రెండో దశ ఎన్నికల్లో 14 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మిగిలిన మరో 14 స్థానాలకు మూడో దశలో మే 07న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆదివారం ఇక్కడ ధర్నాకు దిగారు.కరువు సహాయ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని సిద్దరామయ్య పేర్కొన్నారు. విధానసౌధ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట వీరంతా ధర్నా నిర్వహించారు.కర్ణాటకలోని మొత్తం 236 తాలూకాల్లో 226 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, 48 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని మంత్రులు పేర్కొన్నారు. కరువు సహాయం కోసం రూ. 18,171 కోట్లు డిమాండ్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3454 కోట్లు మాత్రమే విడుదల చేయడానికి సిద్దమైనట్లు వెల్లడించారు. ఈ మొత్తం రాష్ట్ర డిమాండ్లో నాలుగో వంతు కూడా లేదని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement