ఇక మాటలు లేవు.. చేతలే : పవన్‌ | Sakshi
Sakshi News home page

ఇక మాటలు లేవు.. చేతలే : పవన్‌

Published Sun, May 27 2018 3:08 PM

There Will Be No Words From Here Says Pawan Kalyan - Sakshi

నర్సన్నపేట : ఉత్తరాంధ్రలో ఎక్కడికెళ్లినా కన్నీటిగాథలే కనిపిస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి మాటలు ఉండవని అన్నీ చేతలేనని ఆదివారం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పోరాట యాత్రలో వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలనుకుంటోందని, జనసేన వల్లే టీడీపీ 2014 ఎన్నికల్లో గెలిచిందని అన్నారు. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని, వారసత్వ రాజకీయాలకు తాను  వ్యతిరేకమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని ప్రశ్నించారు. అధికారం ఏ ఒక్కడి సొత్తు కాదని అన్నారు. అధికార పార్టీ కరెంటు కట్‌ చేయించి తనపై దాడులు చేస్తోందని ఆరోపించారు.

Advertisement
Advertisement