సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తెలంగాణ అప్పులపాలైందంటూ తెగ ఆవేదన వ్యక్తం చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలన అంతకంటే దారుణంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం ట్విటర్ వేదికగా ఆయన చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు బందిపోటు పాలనలో.. రాష్ట్రం అప్పులు రెండున్నర లక్షల కోట్లకు చేరాయని మండిపడ్డారు.
‘ఏం పనులు చేశారని ఏపీలో లక్షలకోట్ల రుణాలు తీసుకొచ్చారు’ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఒక ప్రాజెక్టు కట్టకపోయినా.. ఒక కాలువ తవ్వకపోయినా డబ్బు చెల్లింపులు మాత్రం జరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.