దేవుడు మాకు ఆ శక్తినిచ్చాడు | Sakshi
Sakshi News home page

దేవుడు మాకు ఆ శక్తినిచ్చాడు

Published Tue, Feb 26 2019 9:40 PM

We Have Gods Power To Save The Earth From Demons Said By Narendra Modi - Sakshi

న్యూడిల్లీ: మానవజాతి నాశనాన్ని కోరుకునే వాళ్లను ఎదుర్కొనేందుకు దేవుడు భారతీయులకు ప్రత్యేకమైన శక్తిని ఇచ్చాడని సర్జికల్‌ దాడుల అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలోని ఇస్కాన్‌ టెంపుల్‌లో జరిగిన ‘గీతారాధన’ కార్యక్రమంలో పాల్గొని మోదీ ప్రసగించారు. దేవుడు ఎప్పుడూ తమవైపే ఉన్నాడని, ఈ మెసేజ్‌ను చెడు శక్తులు, దెయ్యాలకు చేరవేయడానికి తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేషంగా స్పందన వచ్చింది. భారత్‌ మాతాకీ జై అంటూ యువత, ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్‌ జరిపిన సర్జికల్‌ దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు చనిపోయిన సంగతి విదితమే.

 ఈ సర్జికల్‌ దాడుల అనంతరం ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  గాంధీ శాంతి బహుమతి కార్యక్రమంలో పాల్గొని ప్రపంచంలో అతిపొడవైన, పెద్దదైన భగవద్గీతను ఆవిష్కరించారు. ఈ పవిత్రమైన పుస్తకం నుంచి మీకు జీవితానికి సంబంధించిన జవాబులు దొరుకుతాయని, గీతలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని  వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు ప్రధాని మోదీ, ఖాన్‌ మార్కెట్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఇస్కాన్‌ టెంపుల్‌ వరకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణించిన తోటి ప్రయాణికులతో కలిసి సంభాషించి ఫోటోలు దిగారు.

Advertisement
Advertisement