190వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 15 2018 8:59 AM

Ys jagan Mohan Reddy190th Day Prajasankalpayatra Begins - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఆయన శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కతుంగ క్రాస్‌ రోడ్డు, లొల్ల, వాడ పల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా మిర్ల పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉబలంక మీదుగా రావులపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. 

జననేత వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్‌ జగన్, భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement
Advertisement