సాక్షి, ఒంగోలు : ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 101వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఈమేరకు పాదయాత్ర షెడ్యూల్ను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ నైట్ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. చీమకుర్తి నుంచి మంచికలపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి బండ్లముడి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం తొర్రగుడిపాడు క్రాస్ మీదుగా బండ్లముడి కాలనీకి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
మద్యాహ్నం 3.00 గంటలకు వైఎస్ జగన్ తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పల్లమల్లి మీదుగా గడిప్రతివారి పాలెంకు చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు సాయంత్రం 5.00 గంటలకు పాదయాత్రను ముగించి రాత్రి అక్కడే బస చేస్తారు.