మళ్లీ రాజన్న రాజ్యం తెస్తా | Sakshi
Sakshi News home page

మళ్లీ రాజన్న రాజ్యం తెస్తా

Published Thu, Jun 28 2018 3:34 AM

YS Jagan Thanks AP People For Prajasankalpa Success - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం తేవాలన్న దృఢ సంకల్పంతో తానున్నానని, ప్రజలందరి ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావాలని భావిస్తున్నానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్పం పాదయాత్ర 200 రోజుల మైలురాయిని అధిగమించిన సందర్భంగా ఆయన బుధవారం ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని ట్వీట్‌ చేశారు.

మెరుగైన రేపు వస్తుందనే ఆశ ప్రజల కళ్లల్లో గోచరిస్తోందని, వారు తనపై పెట్టుకున్న నమ్మకానికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని జగన్‌ అన్నారు.  ‘‘మెరుగైన రేపటికోసం ఓ ఆశ ప్రజల కళ్లల్లో మెదలాడటం నేను ప్రజాసంకల్పం పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజు నుంచీ చూస్తున్నా... నా 200 రోజుల ప్రజాసంకల్పం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ప్రజలు నాపై ఉంచిన ఈ నమ్మకానికి వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తేవాలన్న దృఢ సంకల్పంతో నేనున్నా... మీ(ప్రజల) ముఖాల్లో ఆ చిరునవ్వులు మళ్లీ తీసుకురావాలని భావిస్తున్నా...’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  

Advertisement
Advertisement