Sakshi News home page

దళితులను దగా చేస్తున్న బాబు

Published Sun, Dec 31 2017 1:32 AM

Ysrcp leaders comments on chandrabu govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ పాలనలో దళితులకు నిలువెల్లా దగా జరుగుతోందని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అరుణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సంక్షేమాన్ని చంద్రబాబు సర్కారు  గాలికొదిలేసిందన్నారు. టీడీపీలో ఉన్న దళిత నేతలు దీన్ని గుర్తించి ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ సీనియర్‌ నేత కె.రాజశేఖర్‌తో కలసి అరుణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ‘దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా’ అని అవహేళన చేశారని, మరో మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరంటూ కించపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

What’s your opinion

Advertisement