Sakshi News home page

సెమీస్‌లో అదితి, మోహన్

Published Sun, Nov 6 2016 10:22 AM

aditi, mohan enters semi final

కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్



సాక్షి, హైదరాబాద్: సీడీకే గ్లోబల్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్‌లో అదితి, మోహన్ సుబ్బరాయన్ సెమీస్‌లోకి ప్రవేశించారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో శనివారం జరిగిన పురుషుల క్వార్టర్స్‌లో మోహన్ (జెన్సర్ టెక్నాలజీస్) 21-16, 21-5తో విశ్వాస్ గురంగ్‌పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అదితి 21-6, 21-7తో మనూష పొన్నంపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో వేదశ్రీ (సిస్కో) 21-15, 21-09తో ఆస్థా సక్సేనాపై, పల్లవి అపర్ణ (ఒరాకిల్) 21-12, 21-11తో వాసవిపై, ఆనీ జార్జ్ (టీసీఎస్) 21-4, 21-6తో పూనమ్‌పై గెలిచారు.
 
 ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు
 
 పురుషుల సింగిల్స్ : హర్ష 21-10, 21-13తో అమిత్ క్రిస్టియన్ షనోరిపై, ఉదయ్ తిరువనల్లూర్ 21-14, 21-15తో అరుణ్ కుమార్‌పై, ఆదర్శ్ 21-18, 21-18తో మనీశ్ కుమార్‌పై నెగ్గారు.
 
 పురుషుల డబుల్స్:  కిరణ్ (ఐసీఐసీఐ)- విశ్వనాథ్ (ఐబీఎం) జంట 21-8, 21-16తో అనిల్- సిజో (టీసీఎస్) జోడీపై, అవినాశ్- వంశీకృష్ణ (విప్రో) జంట 21-15, 21-19తో రవి కిరణ్ (సెంచురీ హాస్పిటల్స్)- రవి (మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్‌‌స) జోడీపై, ప్రవీణ్- రఘు (విప్రో) జంట 21-17, 20-21, 21-18తో రాజశేఖర్- శ్రీకీర్తి వోరుగంటి (వాల్యూ ల్యాబ్స్)పై, ఆదర్శ్ (హెచ్‌పీ)- మోహన్ (జెన్సర్) జంట 15-14, 15-14తో గోపీకృష్ణ (టెక్‌మహీంద్ర)- హర్ష జోడీపై విజయం సాధించారుు.


 మహిళల డబుల్స్: ఆనీ జార్జ్ (టీసీఎస్)- సౌమ్య (అమెజాన్) జంట 21-7, 21-8తో మితా - షీతల్ (పీఎన్‌జీ) జోడీపై, రమ్య- స్నేహ జంట 21-12, 21-16తో అఖీఫా సామియా- అన్నపూర్ణ (సీడీకే) జోడీపై, ఆస్థా సక్సేనా- దీప్తి (ఇన్ఫోసిస్) జంట 21-5, 21-10తో రమ్య- సౌజన్య జోడీపై గెలుపొందారుు.
 
 మిక్స్‌డ్ డబుల్స్: మోహన్- అదితి జంట 15-11, 15-12తో  మనీశ్- పూజ లత్కర్ జోడీపై, అవినాశ్- ఆనీ జార్జ్ జంట 21-9, 21-9తో కిరణ్ నారాయణ్- నీరజ్ గార్గ్ జోడీపై, హర్ష్- ఆస్థా సక్సేనా జంట 21-10, 21-11తో అజయ్- షిఖా జోడీపై, రాకేశ్- కుష్బూ జంట 22-11, 21-11తో ప్రవీణ్- సుభద్ర రాణి జోడీపై నెగ్గాయి.

 

Advertisement

What’s your opinion

Advertisement