ఆంధ్రకు భారీ ఆధిక్యం | Sakshi
Sakshi News home page

ఆంధ్రకు భారీ ఆధిక్యం

Published Tue, Nov 15 2016 12:21 AM

ఆంధ్రకు భారీ ఆధిక్యం - Sakshi

వల్సాడ్:  త్రిపురతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర బ్యాట్స్‌మెన్ చెలరేగారు. మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్‌‌సలో 3 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. హనుమ విహారి (336 బంతుల్లో 144 బ్యాటింగ్; 14 ఫోర్లు), డీబీ ప్రశాంత్ (235 బంతుల్లో 129; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 240 పరుగులు జోడించారు. ఇప్పటికే ఆంధ్ర 206 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

సందీప్ డబుల్ సెంచరీ...
ముంబై: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ బావనక సందీప్ (332 బంతుల్లో 203 నాటౌట్; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అతనికి తోడుగా సీవీ మిలింద్ (208 బంతుల్లో 136; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా కెరీర్‌లో మొదటి శతకం సాధించడంతో సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్‌‌సను హైదరాబాద్ 9 వికెట్లకు 580 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సందీప్, మిలింద్ ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 267 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం సర్వీసెస్ ఆట ముగిసే సమయా నికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement