రన్నరప్‌ అపురూప్‌ రెడ్డి | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ అపురూప్‌ రెడ్డి

Published Sat, Feb 25 2017 10:35 AM

రన్నరప్‌ అపురూప్‌ రెడ్డి

సూపర్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత అండర్‌–18 సూపర్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రాష్ట్రానికి చెందిన అపురూప్‌ రెడ్డి, భక్తి షా ఆకట్టుకున్నారు. త్రివేండ్రమ్‌లో జరిగిన ఈ టోర్నీలో అపురూప్‌ సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచి రెండు పతకాలను సాధించగా... భక్తి డబుల్స్‌ విభాగంలో రజత పతకాన్ని దక్కించుకుంది. బాలుర సింగిల్స్‌ ఫైనల్లో వీఎం సందీప్‌ (తమిళనాడు) 3–6, 6–3, 6–1తో పి. అపురూప్‌ రెడ్డి (తెలంగాణ)పై గెలుపొంది విజేతగా నిలిచాడు. డబుల్స్‌ ఫైనల్లో అపురూప్‌రెడ్డి – సంజయ్‌ (కేరళ) ద్వయం 4–6, 4–6తో ఎస్‌. భూపతి–వీఎం సందీప్‌ (తమిళనాడు) జంట చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది. బాలికల డబుల్స్‌ ఫైనల్లో ఆలియా జుబేర్‌ (మహారాష్ట్ర)–భక్తి షా (తెలంగాణ) జంట 3–6, 4–6తో త్రిష (కేరళ)– ప్రేరణ (మహారాష్ట్ర) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని దక్కించుకుంది.  

 

Advertisement
 
Advertisement