-
రన్నరప్ విష్ణువర్ధన్ జోడి
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ జోడీ రన్నరప్గా నిలిచింది. కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ కోర్టులో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–2, 4–6, 6–10తో రెండో సీడ్ ‘సూద్’ బ్రదర్స్ చంద్రిల్– లక్షిత్ (భారత్) జంట చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు సింగిల్స్ సెమీస్ మ్యాచ్ల్లో ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–4, 6–4తో సామి రెన్వెన్ (జర్మనీ)పై, శ్రీరామ్ బాలాజీ 4–6, 6–3, 7–5తో కరుణుదయ్ సింగ్పై గెలుపొంది ఫైనల్కు చేరుకున్నారు. -
సెమీస్లో విష్ణువర్ధన్ జోడీ
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ నిలకడగా రాణిస్తున్నాడు. కర్ణాటక స్టేట్ లాన్టెన్నిస్ అసోసియేషన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్న విష్ణువర్ధన్... సింగిల్స్లో క్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్ల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 7–5, 6–1తో జుయ్–చెన్ హంగ్ (చైనీస్ తైపీ)–హాంగ్ కిట్ వాంగ్ (హాంకాంగ్) జంటపై గెలుపొందగా... అనిరుధ్–విఘ్నేశ్ జోడీ∙(భారత్) 5–7, 3–6తో అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా)–సామి రెన్వెన్ (జర్మనీ) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్ల్లో మూడో సీడ్ విష్ణువర్ధన్ 6–2, 6–1తో భారత్కే చెందిన దక్షిణేశ్వర్ సురేశ్పై నెగ్గి క్వార్టర్స్కు చేరుకున్నాడు. మరో మ్యాచ్లో శ్రీరామ్ బాలాజీ 6–2, 7–5తో సిద్ధార్థ్ విశ్వకర్మపై గెలుపొందగా... రిషబ్ అగర్వాల్ 4–6, 4–6తో హాడిన్ బావా (భారత్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
ఆకాంక్ష, కౌశిక్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్టీఏ) మాస్టర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో కౌశిక్ కుమార్ రెడ్డి, ఆకాంక్ష సత్తా చాటారు. నేరెడ్మెట్లోని సెయింట్ థామస్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిల్స్ను దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో ఆకాంక్ష 8–3తో సౌమ్య జైన్ను ఓడించగా... బాలుర విభాగంలో వల్లంరెడ్డి కౌశిక్ 8–7 (1)తో ప్రతినవ్పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన బాలుర సెమీస్ మ్యాచ్ల్లో ప్రతినవ్ 8–1తో జిహర్పై, కౌశిక్ 8–2తో హేమంత్ సాయి ప్రభపై గెలుపొందారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టీఎస్టీఏ కోశాధికారి చంద్రశేఖర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
రన్నరప్ అపురూప్ రెడ్డి
సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత అండర్–18 సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రాష్ట్రానికి చెందిన అపురూప్ రెడ్డి, భక్తి షా ఆకట్టుకున్నారు. త్రివేండ్రమ్లో జరిగిన ఈ టోర్నీలో అపురూప్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రన్నరప్గా నిలిచి రెండు పతకాలను సాధించగా... భక్తి డబుల్స్ విభాగంలో రజత పతకాన్ని దక్కించుకుంది. బాలుర సింగిల్స్ ఫైనల్లో వీఎం సందీప్ (తమిళనాడు) 3–6, 6–3, 6–1తో పి. అపురూప్ రెడ్డి (తెలంగాణ)పై గెలుపొంది విజేతగా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో అపురూప్రెడ్డి – సంజయ్ (కేరళ) ద్వయం 4–6, 4–6తో ఎస్. భూపతి–వీఎం సందీప్ (తమిళనాడు) జంట చేతిలో పరాజయం పాలై రన్నరప్గా నిలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో ఆలియా జుబేర్ (మహారాష్ట్ర)–భక్తి షా (తెలంగాణ) జంట 3–6, 4–6తో త్రిష (కేరళ)– ప్రేరణ (మహారాష్ట్ర) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని దక్కించుకుంది. -
రన్నరప్ సాయిదేదీప్య జోడి
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్యకు నిరాశ ఎదురైంది. భీమవరంలో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ ఫైనల్లో దేదీప్య జోడి ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాయిదేదీప్య– వై. సహజ (ఏపీ) ద్వయం 0–6, 2–6తో ఈతీ మహిత–సౌమ్య విగ్ (గుజరాత్) జంట చేతిలో పరాజయం పాలైంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
Advertisement