రెండో ఇన్నింగ్స్లో 108/0
ఇంగ్లండ్తో రెండో టెస్టు
లార్డ్స్: ‘యాషెస్’ తొలి టెస్టులో ఓడిపోయిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో పుంజుకుంది. బౌలింగ్లో చెలరేగిన కంగారూలు బ్యాటింగ్లోనూ నిలకడగా రాణిస్తుండటంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 26 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (60 బ్యాటింగ్), రోజర్స్ (44 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్గా క్లార్క్ సేన 362 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 85/4తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 90.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది.
దీంతో ఆసీస్కు 254 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ కుక్ (96; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. స్టోక్స్ (87; 13 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్కు 145 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను గట్టెక్కించాడు. చివర్లో మొయిన్ అలీ (39), బ్రాడ్ (21) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో హాజెల్వుడ్, జాన్సన్ చెరో మూడు వికెట్లు తీశారు.
పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా
Published Sun, Jul 19 2015 12:47 AM
Related news
-
గెలుపు దిశగా శ్రీలంక
సిల్హెట్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు విజయం దిశగా పయనిస్తోంది. లంక నిర్దేశించిన 511 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 119/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 110.4 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన ధనంజయ డిసిల్వా (108; 9 ఫోర్లు, 2 సిక్స్లు), కామిందు మెండిస్ (164; 16 ఫోర్లు, 6 సిక్స్లు) అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్లోనూ శతకాలు బాది చరిత్ర పుటల్లోకి ఎక్కారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో ఇద్దరు బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో 1974లో న్యూజిలాండ్తో వెల్లింగ్టన్లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియా బ్యాటర్లు ఇయాన్ చాపెల్ (145, 121), గ్రెగ్ చాపెల్ (247 నాటౌట్, 133)...2014లో అబుదాబిలో ఆ్రస్టేలియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లు మిస్బా ఉల్ హక్ (101, 101 నాటౌట్), అజహర్ అలీ (109, 100 నాటౌట్) ఈ ఘనత సాధించారు. -
పాపం కేన్ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్ నుంచి వస్తున్న సహచరుడు విల్ యంగ్ను గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. కేన్ క్రీజ్కు చేరకునే లోపు లబూషేన్ డైరెక్ట్ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్ రనౌట్ కావడానికి ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్ పరుగు తీస్తుండగా.. స్టార్క్ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్ రనౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS...!!! 🤯pic.twitter.com/KRheTm61sg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 కాగా, ఆసీస్ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్తో పాటు రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్ మిచెల్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. 204 పరుగుల లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
బుద్ధుడి అవశేషాల ప్రదర్శన థాయ్లాండ్లో..
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికలను, చితాభస్మాన్ని బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం థాయ్లాండ్లో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 18 వరకూ మధ్య థాయ్లాండ్లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది. థాయ్లాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్ధుని అస్థికలను, చితాభస్మాన్ని థాయ్లాండ్కు పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నేతృత్వంలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్క్రాఫ్ట్లో పటిష్టమైన భద్రత నడుమ వీటిని పంపనున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. శిష్యుల అస్థికలు కూడా.. బుద్ధ భగవానుని అస్థికలతోపాటు అతని శిష్యులైన అర్హంత్ సరిపుత్ర, అర్హంత్ మహామొగల్యన్లో అస్థికలను కూడా థాయ్లాండ్ పంపనున్నారు. ప్రస్తుతం ఈ మహనీయుల చితాభస్మం మధ్యప్రదేశ్లోని సాంచి స్థూపంలో భద్రపరిచారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించిన తర్వాత వీరి అస్థికలను థాయ్లాండ్కు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పంపిస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానునికి సంబంధించిన 22 పవిత్ర అస్థికలు ఉన్నాయి. వీటిలో 20 అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా, రెండు కోల్కతా మ్యూజియంలో ఉన్నాయి. వీటిలో నాలుగు అస్థికలను ఇప్పుడు థాయ్లాండ్కు పంపుతున్నారు. రెండోసారి థాయ్లాండ్కు.. బౌద్ధమత అనుచరులు ఈ పవిత్ర అస్థికలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక, కంబోడియా, సింగపూర్, దక్షిణ కొరియాలకు అక్కడి ప్రజల సందర్శనార్థం పంపారు. ఇప్పుడ రెండోసారి థాయ్లాండ్కు వీటిని పంపుతున్నారు. గతంలో అంటే 1995లో తొలిసారి బుద్ధుని అస్థికలను థాయ్లాండ్కు పంపారు. -
Australia v West Indies: విండీస్ సంచలనం
బ్రిస్బేన్: వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరిగే బంతులతో ఆ్రస్టేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 1997 తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై వెస్టిండీస్కు తొలిసారి టెస్టులో విజయం అందించాడు. ఇప్పటి వరకు ఆడిన 11 డే/నైట్ టెస్టుల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా జట్టు షామర్ దెబ్బకు 12వ డే/నైట్ టెస్టులో తొలిసారి పరాజయం రుచి చూసింది. డే/నైట్గా జరిగిన రెండో టెస్టులో ఆట నాలుగో రోజు 216 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ్రస్టేలియా ఓవర్నైట్ స్కోరు 60/2తో బరిలోకి దిగింది. ఒకదశలో ఆసీస్ 113/2తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కామెరాన్ గ్రీన్ (42; 4 ఫోర్లు)ను, ట్రావిస్ హెడ్ (0)ను షామర్ జోసెఫ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఒకవైపు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇతర ఆసీస్ బ్యాటర్లను షామర్ పెవిలియన్కు పంపించాడు. చివరకు ఆ్రస్టేలియా 50.5 ఓవర్లలో 206 పరుగులవద్ద ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. రెండు టెస్టుల సిరీస్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. షామర్ జోసెఫ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. షామర్ ఈ సిరీస్లో 13 వికెట్లు తీయడంతోపాటు 57 పరుగులు చేశాడు. సంక్షిప్త స్కోర్లు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 289/9 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 193; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 206 ఆలౌట్ (50.5 ఓవర్లలో) (స్టీవ్ స్మిత్ 91 నాటౌట్, గ్రీన్ 42, స్టార్క్ 21, షామర్ జోసెఫ్ 7/68). -
Ind vs Eng 1st Test Hyd: మొదటి టెస్టు మన చేతుల్లోకి...
భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఊహించిన దిశలోనే సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్ను కట్టడి చేసిన టీమిండియా రెండో రోజు తమ బ్యాటింగ్ సత్తా చూపించింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చక్కటి అర్ధసెంచరీలకు తోడు శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్ సమయోచిత సహకారం జట్టును భారీ ఆధిక్యంలో నిలిపాయి. శుక్రవారం 3.47 రన్రేట్తో 87 ఓవర్లలోనే 302 పరుగులు సాధించిన టీమిండియాకు టెస్టుపై పట్టు చిక్కింది. పేలవ బౌలింగ్తో భారత్ను నిలువరించడంలో విఫలమైన ఇంగ్లండ్ ఇప్పటికే దాదాపుగా చేతులెత్తేసింది. రెండో రోజు ఒక రనౌట్ను మినహాయిస్తే ఆ జట్టు ఐదు వికెట్లే తీయగలిగింది. మరో మూడు వికెట్లతో భారత్ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉండగా... ఇంగ్లండ్ ఎంతవరకు పోరాడుతుందనేది చూడాలి. సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్ బలంతో భారత జట్టు ఇంగ్లండ్పై తొలి టెస్టులో ఆధిపత్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 110 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (123 బంతుల్లో 86; 8 ఫోర్లు, 2 సిక్స్లు), రవీంద్ర జడేజా (155 బంతుల్లో 81 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా... కోన శ్రీకర్ భరత్ (81 బంతుల్లో 41; 3 ఫోర్లు), అక్షర్ పటేల్ (62 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇప్పటికే భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉండగా... క్రీజ్లో ఉన్న జడేజా, అక్షర్ ఎనిమిదో వికెట్కు అభేద్యంగా 63 పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్లో భారత్ ఐదు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయగా... మూడింటిలో జడేజా ఉన్నాడు. భారత్ టాప్–5 బ్యాటర్లంతా దూకుడుగా ఆడబోయి అటాకింగ్ షాట్లకే వెనుదిరగడం విశేషం. సమష్టి బ్యాటింగ్తో... ఓవర్నైట్ స్కోరు 119/1తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్లు) వికెట్ కోల్పోయింది. క్రీజ్లో ఉన్నంత సేపు ఇబ్బందిగానే కనిపించిన శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే రాహుల్, శ్రేయస్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 64 పరుగులు జోడించారు. శ్రేయస్ భారీ స్కోరు చేయడంలో విఫలం కాగా... 72 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. వుడ్ ఓవర్లో అతను కొట్టిన మూడు ఫోర్లు హైలైట్గా నిలిచాయి. రేహన్ ఓవర్లో రాహు ల్ రెండు సిక్సర్లు బాదడంతో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే అతను సెంచరీ చాన్స్ను పోగొట్టుకున్నాడు. రాహుల్ పెవిలియన్కు చేరిన సమయంలో భారత్ 42 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. దాంతో చివరి వికెట్ల తీయగల మని ఇంగ్లండ్కు ఆశ కలిగింది. కానీ జడేజా వాటిని వమ్ము చేశాడు. ముందుగా భరత్తో, ఆ తర్వాత అక్షర్ పటేల్తో అతను రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఆంధ్ర ఆటగాడు భరత్ పెద్ద స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 84 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ చేశాడు. జడేజాతో సమన్వయలోపంతో అశ్విన్ (1) రనౌట్ కావడం ఒక్కటే కాస్త నిరాశపర్చింది. తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ అక్షర్ కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ బౌలర్లు బేలగా చూస్తుండిపోయారు. హార్లీ వేసిన చివరి ఓవర్లో అక్షర్ వరుసగా 4, 6, 4 బాది రోజును ముగించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి అండ్ బి) రూట్ 80; రోహిత్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 24; గిల్ (సి) డకెట్ (బి) హార్లీ 23; రాహుల్ (సి) రేహన్ (బి) హార్లీ 86; శ్రేయస్ (సి) హార్లీ (బి) రేహన్ 35; జడేజా (బ్యాటింగ్) 81; భరత్ (ఎల్బీ) (బి) రూట్ 41; అశ్విన్ (రనౌట్) 1; అక్షర్ పటేల్ (బ్యాటింగ్) 35; ఎక్స్ట్రాలు 15; మొత్తం (110 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 421. వికెట్ల పతనం: 1–80, 2–123, 3–159, 4–223, 5–288, 6–356, 7–358. బౌలింగ్: వుడ్ 13–0–43–0, హార్లీ 25–0–131–2, లీచ్ 25–6–54–1, రేహన్ 23–3–105–1, రూట్ 24–2–77–2.
Related News by category
-
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
తీవ్ర విషాదం.. క్రికెటర్ ఈశ్వర్ ఇకలేరు
విశాఖపట్నం: జీవీఎంసీ 68వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన క్రికెటర్ సోముదల ఈశ్వర్(40) కన్నుమూశారు. ఆగస్టు 28వ తేదీనే ఆయన గుండెపోటుతో మృతి చెందగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాఖలో డివిజన్ క్రికెట్ ఆడుతూనే ఈశ్వర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏసీఏకు చేదోడు వాదోడుగానూ ఉంటూ.. టోర్నీల నిర్వహణలో సహాయం అందించేవాడు. అలా ఆయన ప్రతిభ ఐపీఎల్కు తాకింది. ఎడమ చేతి వాటం బౌలర్ అయిన ఈశ్వర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్లకు నెట్స్లో బంతులు విసిరేందుకు సహాయకుడిగా చేరాడు. ఐపీఎల్లో సపోర్టింగ్ స్టాఫ్గా ప్రస్థానం కొనసాగిస్తూనే.. విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్ పాల్గొన్నాడు. ఇటీవల ఏపీఎల్ సీజన్ ముగియడంతో అప్పన్నకాలనీలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నెల 28న స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చాడు. బైక్ దిగి స్టాండ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తల్లి రాములమ్మ తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడని బోరున విలపించారు. ఈ వార్త విన్న భారత క్రికెటర్ శ్రీకర్ భరత్.. ఈశ్వర్ ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈశ్వర్కు వివాహం కాలేదు. క్రికెటర్ వేణుగోపాల్తో సాన్నిహిత్యం తన 16వ ఏటనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈశ్వర్కు పేదరికం వెంటాడింది. 10వ తరగతి వరకు చదువుకున్న ఈశ్వర్ క్రికెట్టే ప్రపంచంగా భావించాడు. క్రికెటర్ వేణుగోపాల్, ఈశ్వర్ ఇద్దరూ రంజీ సెలక్షన్కు వెళ్లారు. వేణుగోపాల్ రంజీకి ఎంపిక కాగా.. ఈశ్వర్కు నిరాశే మిగిలింది. అయినా ఏనాడు కుంగిపోలేదు. ఈ క్రమంలో ఈశ్వర్పై అభిమానం పెంచుకున్న వేణుగోపాల్ తనతో పాటు పలు మ్యాచ్లకు తీసుకువెళ్లేవాడు. ఈశ్వర్ ఫాస్ట్ బౌలర్. గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఈశ్వర్ బౌలింగ్ అంటే భారత క్రికెటర్లకు ఎంతో ఇష్టం. అందుకే స్టార్ క్రికెటర్లు ఆయనతో బౌలింగ్ వేయించుకుని నెట్ ప్రాక్టీస్ చేసేవారు. దీంతో ఈశ్వర్కు ఎక్కువగా భారత క్రికెట్ క్యాంపుల్లో అవకాశం దక్కేది. అలా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రికీ పాటింగ్, డేవిడ్ వార్నర్.. తదితర ఎంతో మంది క్రికెటర్లకు అభిమానిగా మారాడు. ఈశ్వర్ను ఎక్సట్రా ప్లేయర్గా అన్ని విషయాల్లో సమానంగా చూసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మరణవార్త తెలుసుకున్న క్రికెటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మృతి బాధాకరం నేనూ ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ప్రస్తుత సీజన్ ఐపీఎల్లో ఆడాను. జట్టుతో పాటు ప్రాక్టీస్ చేసేప్పుడు ఈశ్వర్ నెట్స్లో బంతులు విసిరేవాడు. ఇద్దరం విశాఖ వాసులమే కావడంతో తొలినాళ్ల నుంచి అతనితో పరిచయం ఉంది. అతను అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరం. – భరత్, భారత టెస్ట్ క్రికెటర్ ప్రగాఢ సానుభూతి మా అన్ని శిక్షణ సెషన్స్, మ్యాచ్ల్లో జట్టుకు సహాయకారిగా ఉన్న ఈశ్వర్ను మిస్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మా ప్రియమైన సైడ్ ఆర్మ్ స్పెషలిస్ట్ ఈశ్వర్ ఇకలేరు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. – ఢిల్లీ కాపిటల్స్ మేనేజ్మెంట్ -
గోల్ కొట్టిన విరాట్కోహ్లీ.. జస్ట్మిస్
క్రికెట రారాజు విరాట్కోహ్లీ ... ఫుట్బాల్ మైదానంలో సందడి చేశాడు. క్రికెట్ ఆటలో ఎంతో కచ్చితత్వంతో బాల్ని బౌండరీలు దాటించే కోహ్లీ.. అదే తీరుని ఫుట్బాల్ మైదానంలోనూ చూపించాడు. ఆక్సిడెంటల్ క్రాస్బార్ ఛాలెంజ్ పేరుతో చాలా దూరం నుంచి గోల్పోస్ట్కి గురి పెట్టాడు కోహ్లీ. తన నైపుణ్యం అంతా ఉపయోగించి బాల్ని కిక్ చేశాడు. గోల్కీపర్ను తప్పించుకుని గోల్పోస్ట్లో బాల్ పడినట్టే అనిపించింది. అయితే చివరి క్షణంలో గోల్పోస్ట్ పోల్కి బాల్కి అడ్డుగా నిలిచింది. దీంతో గోల్ మిస్ అయ్యింది. క్రికెట్లోనే కాదు ఫుట్బాల్లోనూ కోహ్లీ ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు Accidental crossbar challenge 😂 pic.twitter.com/koeSSKGQeb — Virat Kohli (@imVkohli) May 25, 2021 -
ఇంగ్లండ్కు భారీ షాక్: న్యూజిలాండ్తో సిరీస్కు ఆర్చర్ దూరం
లండన్: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయం కారణంగా భారత్ పర్యటన, ఐపీఎల్లకు దూరమైన ఆర్చర్.. కౌంటీ క్రికెట్లో ససెక్స్ తరపున పునరాగమనం చేశాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన వెంటనే మైదానాన్ని వీడాడు. ఇంగ్లాండ్, ససెక్స్ సీమర్ జోఫ్రా ఆర్చర్ వచ్చే నెల న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బౌలింగ్ చేసేటప్పుడు అతని కుడి మోచేయి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ చివరి రెండు రోజులలో బౌలింగ్ చేయలేకపోయాడని ఈసీబీ వివరించింది. ఇంగ్లండ్,న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ జూన్ 2న లార్డ్స్ మైదానంలో ప్రారంభంకానుంది. చదవండి: శ్రీలంక ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత -
ఆటగాళ్లకు షాకిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆటగాళ్ల జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది. దీంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్,సురంగ లక్మల్,దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కేంద్ర ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ క్యాటగిరిలో వేసింది. దీంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 23 నుంచి బంగ్లాదేశ్లో ఈ జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్నది. కెప్టెన్కు కూడా తగ్గనున్న జీతం అద్భుతమైన ఫామ్లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయన జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన కరునరత్నే.. బంగ్లాదేశ్తో సిరీస్లో 3 ఇన్నింగ్స్లలో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు తగ్గించారు. (చదవండి:10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్)
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కేజ్రీవాల్ను చూసేందుకు.. భార్య సునీతకు అనుమతి నిరాకరణ
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement