యూకీ శుభారంభం

1 Jan, 2017 02:08 IST|Sakshi
యూకీ శుభారంభం

చెన్నై: టెన్నిస్‌ సీజన్‌ తొలి టోర్నమెంట్‌ చెన్నై ఓపెన్‌లో భారత యువతార యూకీ బాంబ్రీ క్వాలిఫయింగ్‌ విభాగంలో శుభారంభం చేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో యూకీ 7–5, 6–1తో మార్కో సెసిహినాతో (ఇటలీ)పై గెలుపొందాడు. రెండో రౌండ్‌లో నికొలస్‌ కికెర్‌ (అర్జెంటీనా)తో యూకీ తలపడతాడు. మరోవైపు భారత నంబర్‌వన్‌ సాకేత్‌ మైనేనికి క్లిష్టమైన ‘డ్రా’ పడింది. సోమవారం మొదలయ్యే మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో తొలి రౌండ్‌లో మిఖాయిల్‌ యూజ్నీ (రష్యా)తో సాకేత్‌ ఆడనున్నాడు.

>
మరిన్ని వార్తలు