సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్, రంగారెడ్డి బాలబాలికల జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. సికింద్రాబాద్లోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ వేదికగా ఆదివారం జరిగిన బాలుర సెమీఫైనల్ మ్యాచ్ల్లో హైదరాబాద్ 36–9తో మహబూబ్నగర్ను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో విజేత జట్టులో రిత్విక్ (8), సంహిత్ (5), శ్రవణ్ (4) ఆకట్టుకున్నారు. మహబూబ్నగర్ తరఫున రోహిత్ (4), హేమంత్ (3) పాయింట్లు సాధించారు. మరో సెమీస్లో రంగారెడ్డి జట్టు 43–38తో కరీంనగర్పై గెలుపొందింది. తొలి అర్ధభాగంలో 16–20తో వెనుకబడిన రంగారెడ్డి రెండో అర్ధభాగంలో పుంజుకుంది. నాగార్జున (18), భరత్ (10), సుజిత్ (7)చెలరేగడంతో విజయాన్ని అందుకుంది. కరీంనగర్ తరఫున ప్రవీణ్ (15), పవన్ (10) సత్తా చాటారు. బాలికల విభాగంలోనూ హైదరాబాద్, రంగారెడ్డి జట్లు ఫైనల్కు చేరుకున్నాయి.
తొలి సెమీఫైనల్లో హైదరాబాద్ 57–32తో మహబూబ్నగర్పై విజయం సాధించింది. రుచి (15), హిత (8), రాగమయి (6), గుణశ్రీ (6) రాణించడంతో తొలి అర్ధభాగాన్ని హైదరాబాద్ 25–14తో ముగించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి గెలిచింది. మహబూబ్నగర్ తరఫున తనూజ (10), భువనేశ్వరి (8), శ్రీవల్లిక (6) రాణించారు. రెండో సెమీఫైనల్లో రంగారెడ్డి 55–17తో కరీంనగర్ను ఓడించింది. విజేత జట్టు తరఫున లాస్య (16), జాహ్నవి (12) ఆకట్టు కోగా... కరీంనగర్ జట్టులో రేణుక (9) పోరాట పటిమ ప్రదర్శించింది.