తూకంలో తేడా రావద్దు
బొమ్మలరామారం : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో పాదర్శకత పాటించాలని, తేడా వస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ హెచ్చరించారు. బొమ్మలరామారం మండలం రామలింగంపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. కాంటావేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, రైతులకు టార్పాలిన్లు అందజేయాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, తహసీల్దార్ శ్రీనివాస్ రావు, ఏఓ పద్మ, ఎంపీటీసీ ఏర్వ హేమంత్రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ జహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
జగన్ సీఎం కావాలని యాదాద్రిలో హోమంయాదగిరిగుట్ట : ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ 150కి పైగా సీట్లు గెలుచుకొని వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ స్థానిక సలహాదారుడు వడ్లోజు వెంకటేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వైఎస్ జగన్, భారతి పేరున అర్చన, శ్రీసుదర్శన హోమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జగన్ సీఎం కావాలని హోమం నిర్వహించినట్లు వడ్లోజు వెంకటేష్ తెలిపారు. శనివారం వైఎస్ జగన్ను కలిసి యాదాద్రీశుడి ప్రసాదం అందజేయనున్నట్లు వెల్లడించారు.
ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా
తనిఖీ చేయాలి
భువనగిరి క్రైం : నిఘా బృందాలు అప్రమత్తంగా ఉండాలని, చెక్పోస్టుల వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎన్నికల పోలీసు వ్యయ పరిశీలకుడు నవీన్ సూచించారు. శుక్రవారం ఆయన భువనగిరి, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పా టు చేసిన చెక్పోస్టులు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అందులో భాగంగా బీబీనగర్ మండలంలోని గూడూరు చెక్పోస్ట్, రాఘవాపురం, భూదాన్పోచపంల్లి మండలం కప్రాయిపల్లి పోలింగ్ కేంద్రాలు, చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట సర్వైలైన్స్ చెక్పోస్టు, పంతంగి చెక్పోస్టు, తూప్రాన్పేట పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. వీటితో పాటు చిట్యాల, నార్కట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, వట్టిమర్తి వద్ద స్టాటిస్టికల్ సర్వైలైన్ చెక్పోస్టును తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. ఆధారాలు లేకుండా పరిమితికి మించి తీసుకెళ్తున్న నగదును సీజ్ చేయాలని, అక్రమ మద్యం, గంజాయిపై నిఘా ఉంచాలన్నారు. ఆయన వెంట చౌటుప్పల్ మధుసూదన్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, లైజనింగ్ అధికారి శ్యాంసుందర్, పోలీస్ అధికారులు జున్నారు.
‘ఎంజీయూ’ కోర్సుల్లో సీట్ల పెంపునల్లగొండ రూరల్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో సీట్లు పెంచుతున్నట్లు వీసీ గోపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం యూని వర్సిటీలో నిర్వహించిన అకాడమిక్ సెనెట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీజీ, ఇంజనీరింగ్, పీహెచ్డీలో సీట్ల పెంపును సెనెట్ కమిటీ ఆమోదించిందని తెలిపారు. నూతన విద్యా సంవత్సరంలో కోర్సులు, సిలబస్లో మార్పులను ఆమోదించిందని.. భవిష్యత్ సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మారుతున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ విద్యా ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. సమావేశంలో మాజీ వీసీ గంగాధర్, మాజీ రిజిస్ట్రార్లు నరేందర్రెడ్డి, యాదగిరి, రవి, ఓఎస్డీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.