క్రికెట్‌ ముద్దు... డ్రగ్స్‌ వద్దు | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ ముద్దు... డ్రగ్స్‌ వద్దు

Published Tue, Nov 7 2017 1:00 AM

Indian captain Virat Kohli was involved in anti-drug campaign - Sakshi

తిరువనంతపురం: మూడో టి20కి ముందు రోజు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. యువత డ్రగ్స్‌ తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అతను పిలుపునిచ్చాడు. కేరళ రాష్ట్ర పోలీసులు ప్రారంభించిన ‘ఎస్‌ టు క్రికెట్‌ అండ్‌ నో టు డ్రగ్స్‌’కు విరాట్‌ తన మద్దతు పలికాడు.

వేలాది మంది విద్యార్థులతో ఇక్కడ నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి కోహ్లితో పాటు పలువురు భారత జట్టు సభ్యులు కూడా హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా ఇందులో పాల్గొన్నారు.   

Advertisement
Advertisement