'విజయవాడలో ఆమెకు 500 గజాల స్థలం' | Sakshi
Sakshi News home page

'విజయవాడలో ఆమెకు 500 గజాల స్థలం'

Published Thu, Aug 31 2017 5:27 PM

'విజయవాడలో ఆమెకు 500 గజాల స్థలం'

అమరావతి: అర్జున అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖ గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలిశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిందు చేతుల మీదుగా జాతీయ క్రీడాపురస్కారం అర్జున అవార్డు అందుకున్నందుకు ఆమెను సీఎం అభినందించారు. జ్యోతి సురేఖకు విజయవాడలో 500 గజాల స్థలం, కోటి రూపాయల నగదు ప్రోత్సాహం ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీయిచ్చారు. ఆమె పేరును ప్రభుత్వ ఉద్యోగానికి పేరు సిఫారసు చేస్తామన్నారు.

స్కేటింగ్‌లో గిన్నీస్‌ రికార్డు సాధించిన జి.దేవిశ్రీప్రసాద్‌ కూడా సీఎం చంద్రబాబును కలిశారు. అతడికి ముఖ్యమంత్రి 10 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. దేవిశ్రీప్రసాద్‌ శిక్షణ సదుపాయాలు కల్పిస్తామని, తిరుపతి ఎస్వీయూలో స్కేటింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తామని ఆయన హామీయిచ్చారు.

Advertisement
Advertisement