రియో డి జనీరో: జాతీయ రికార్డును బద్దలు కొట్టిన భారత మహిళా అథ్లెట్ లలితా శివాజీ బబర్ రియో ఒలింపిక్స్లో 3000 మీటర్ల స్టీపుల్చేజ్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్లో హీట్-2లో పాల్గొన్న లలిత 9 నిమిషాల 19.76 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. 9 నిమిషాల 26.55 సెకన్లతో సుధా సింగ్ పేరిట ఉన్న జాతీయ రికార్డును లలిత తిరగరాసింది. హీట్-3లో బరిలోకి దిగిన భారత్కే చెందిన మరో అథ్లెట్ సుధా సింగ్ 9 నిమిషాల 43.29 సెకన్లలో లక్ష్యానికి చేరి తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఓవరాల్గా లలిత ఏడో స్థానంలో, సుధా సింగ్ 30వ స్థానంలో నిలిచారు. మొత్తం 15 మంది పాల్గొనే ఫైనల్ రేసు సోమవారం (15న) జరుగుతుంది. తాజా ఫలితంతో లలిత బబర్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఫైనల్కు చేరిన ఎనిమిదో అథ్లెట్గా గుర్తింపు పొందింది. గతంలో మిల్కా సింగ్, గుర్బచన్ సింగ్ రణ్ధావ, శ్రీరామ్ సింగ్, పీటీ ఉష, అంజూ బాబీ జార్జ్ (లాంగ్జంప్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), వికాస్ గౌడ (డిస్కస్ త్రో) మాత్రమే భారత్ నుంచి ఫైనల్ ఈవెంట్కు అర్హత సాధించారు.
హీట్స్లో ద్యుతీ చంద్ అవుట్
మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ హీట్స్లోనే వెనుదిరిగింది. హీట్-5లో పాల్గొన్న ద్యుతీ 11.69 సెకన్లలో రేసును పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల విభాగంలో అనస్ హీట్-7లో పాల్గొని 45.95 సెకన్లలో గమ్యానికి చేరుకొని ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల లాంగ్జంప్లో అంకిత్ శర్మ (7.67 మీటర్లు) 12వ స్థానంలో, మహిళల 400 మీటర్ల విభాగంలో నిర్మల 44వ స్థానంలో నిలిచింది.
మహిళల హాకీ జట్టుకు నిరాశ
36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్కు అర్హత పొందిన భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరుకోవడంలో విఫలమైంది. అర్జెంటీనాతో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 0-5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. తమ గ్రూప్లో చివరిదైన ఆరో స్థానంతో సంతృప్తి పడింది.
షూటర్లకు దురదృష్టం
షూటింగ్ విభాగంలో భారత్కు మళ్లీ నిరాశే మిగిలింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫయింగ్లో గుర్ప్రీత్ సింగ్ 581 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. టాప్-6లో నిలిచిన వారే ఫైనల్కు చేరుతారు. పురుషుల స్కీట్ విభాగంలో మేరాజ్ అహ్మద్ ఖాన్ ‘షూట్ ఆఫ్’లో విఫలమై సెమీఫైనల్కు చేరుకోలేకపోయాడు.
రోయర్ దత్తూకు 15వ స్థానం
రోయింగ్లో దత్తూ బబన్ భోకనాల్ ఓవరాల్గా 15వ స్థానంలో నిలిచాడు. సింగిల్ స్కల్స్ ర్యాంకింగ్ రేసులో దత్తూ 6 నిమిషాల 54.96 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచాడు.
ఓటమితో ముగించిన జ్వాల జంట
మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్న జంట చివరిదైన మూడో మ్యాచ్లో 17-21, 15-21 తో పుట్టిటా-సప్సిరి (థాయ్లాండ్) జోడీ చేతిలో ఓడింది.
స్టీపుల్చేజ్ ఫైనల్లో లలిత
Published Sun, Aug 14 2016 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement