సెమీస్‌లో పేస్ జోడి | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో పేస్ జోడి

Published Fri, Sep 27 2013 1:15 AM

సెమీస్‌లో పేస్ జోడి

న్యూఢిల్లీ: భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-డానియెలి బ్రాసియెలి (ఇటలీ)... థాయ్‌లాండ్ ఓపెన్ సెమీస్‌లోకి ప్రవేశించారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో రెండోసీడ్ పేస్-డానియెలి జంట 6-7 (4), 7-6 (8), 10-8తో కొలంబియా జోడి యువాన్ సెబాస్టియన్ కాబల్-రొబెర్ట్ ఫర్హాపై విజయం సాధించింది.
 
  మరోవైపు కౌలాంలపూర్‌లో జరుగుతున్న మలేసియా ఓపెన్ డబుల్స్ క్వార్టర్స్‌లో స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్-రిక్ డి వోయెస్ (దక్షిణాఫ్రికా) 3-6, 6-4, 10-7తో జిమోన్‌జిక్ (సెర్బియా)-జూలియన్ బెన్నెటియూ (స్విట్జర్లాండ్)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు.
 

Advertisement
Advertisement