Sakshi News home page

ఐపీఎల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

Published Tue, Apr 25 2017 7:42 PM

ఐపీఎల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా మంగళవారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుల మధ్య జరుగనున్న లీగ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఈ మ్యచ్ కు టాస్ వేసే సమయానికి వర్షం పడుతుండటంతో మ్యాచ్ కొంత ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ లో చిత్తుగా ఓడిన బెంగళూరు ఈ మ్యాచ్ లో ఎలాగైన నెగ్గాలనే పంతంతో బరిలోకి దిగుతుంది. అలాగే సన్ రైజర్స్ ఇప్పటి వరకు హోం గ్రౌండ్ లో మినహా బయటి గ్రౌండ్ లో గెలవలేదు. దాంతో ఈ మ్యాచ్ లో గెలిచి 'బయట' బోణి కొట్టాలని భావిస్తుంది.  వీరి ఆశలపై వర్షం కరుణిస్తుందో లేదో చూడాలి.

Advertisement

What’s your opinion

Advertisement