మైదానంలో కుప్పకూలి...

30 Apr, 2015 01:17 IST|Sakshi
మైదానంలో కుప్పకూలి...

బ్రస్సెల్స్: ఇటీవలి కాలంలో తరచూ క్రికెటర్లు ప్రాణం మీదికి తెచ్చుకుంటున్న సంఘటనలు చూశాం. ఇప్పుడు తాజాగా ఫుట్‌బాల్ మైదానంలోనూ విషాదం చోటుచేసుకుంది. బెల్జియంకు చెందిన 24 ఏళ్ల గ్రెగరీ మెర్టెన్స్ మ్యాచ్ ఆడుతుండగానే తీవ్ర గుండెనొప్పితో కుప్పకూలాడు. మంగళవారం స్పోర్టింగ్ లోకెరెన్ తరఫున ఆడిన తను బరిలోకి దిగిన 20 నిమిషాల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడిని కోమాలో ఉంచి చికిత్స కొనసాగిస్తుండగా ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది.

మరిన్ని వార్తలు