చెలరేగిన శ్రేయస్‌ అయ్యర్‌ : కేకేఆర్‌కు భారీ లక్ష్యం | Sakshi
Sakshi News home page

చెలరేగిన శ్రేయస్‌ అయ్యర్‌

Published Fri, Apr 27 2018 9:44 PM

New Captain Iyer 93 not out lifts DD to 219 - Sakshi

ఢిల్లీ:ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రేయస్‌ అయ్యర్‌(93 నాటౌట్‌;40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు), పృథ్వీ షా(62; 44బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడటంతో ఢిల్లీ భారీ స్కోరు నమోదు చేసింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కోలిన్‌ మున్రో-పృథ్వీ షాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన తర్వాత మున్రో(33) ఔటయ్యాడు. ఆపై పృథ్వీషా -శ్రేయస్‌ అయ్యర్‌ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే తొలుత 38 బంతుల్లో పృథ్వీషా హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయ్యర్‌తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత పృథ్వీ షారెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు. దాంతో ఢిల్లీ 129 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.

అయితే అయ్యర్‌-మ్యాక్స్‌వెల్‌ జోడి మరింత దూకుడుగా ఆడింది. ఈ క్ర​మంలోనే అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి 73 పరుగులు జత చేశాడు.  చివర్లో కోల్‌కతా బౌలర్లపై అయ్యర్‌  విరుచుకుపడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.

Advertisement
Advertisement