వీరభద్రసింగ్పై ఇమ్రాన్ ఫైర్ | Sakshi
Sakshi News home page

వీరభద్రసింగ్పై ఇమ్రాన్ ఫైర్

Published Sun, Mar 6 2016 9:01 PM

వీరభద్రసింగ్పై ఇమ్రాన్ ఫైర్

కరాచీ: వరల్డ్ టీ 20లో భాగంగా భారత్-పాకిస్తాన్ల మధ్య ఈనెల 19వ తేదీన ధర్మశాలలో  జరగాల్సిన మ్యాచ్పై ఇరు దేశాల పెద్దల స్వరం తీవ్రమవుతోంది. ఈ మ్యాచ్ను ఇక్కడే నిర్వహిస్తే అమరవీరుల కుటుంబాలను కించపరిచినట్లే అవుతుందన్న హిమచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎం వీరభద్ర సింగ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తాజాగా మండిపడ్డాడు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అసహ్యించుకునేలా మాట్లాడుతుండటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాడు.

 

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్కు ధర్మశాలలో ఆడాల్సిన అవసరం లేదని ఇమ్రాన్ స్పష్టం చేశాడు.  కేవలం సీఎం వీరభద్రసింగ్ మాత్రమే పాకిస్తాన్ జట్టుకు వ్యతిరేకం వ్యాఖ్యలు చేయడం ఆయన బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుందంటూ ఎద్దేవా చేశాడు. ఈ నేపథ్యంలో తమ జట్టు ధర్మశాలలో భారత్ తో జరిగే మ్యాచ్ను ఆడుతుందని తాను అనుకోవడం లేదని ఇమ్రాన్ అభిప్రాయపడ్డాడు.

Advertisement
Advertisement