తిరువనంతపురం:టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగనున్న మూడో టీ 20కి వరుణుడు అడ్డంకిగా మారాడు. దాంతో మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మంగళవారం తేలికపాటి జల్లులు పడటంతో పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే టాస్ ఆలస్యం కానుంది.
ఇది సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో మ్యాచ్ ను నిర్వహించేందుకు కేరళ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా కృషి చేస్తోంది. సోమవారం కూడా ఇక్కడ భారీగా వర్షం కురిసింది. డ్రైనేజీ వ్యవస్థ చాలా బాగుందని చెబుతున్నా... ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆట సజావుగా సాగడం మాత్రం కష్టంగానే కనబడుతోంది.